Saurabh Netravalkar: పాక్కు ‘సూపర్’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్.. ఎవరీ సౌరభ్ నేత్రావల్కర్?
Saurabh Netravalkar: పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే అమెరికా సంచలన విజయాన్ని అందుకుంది. సూపర్ ఓవర్లో పాకిస్థాన్పై అద్భుతంగా బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ టోర్నీ (T20 World Cup 2024)లో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు. పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్తో పాకిస్థాన్ (USA vs PAK)కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ బాబర్ జట్టును కంగుతినిపించాడు. తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్గా బౌలింగ్ చేసి అమెరికాకు ‘సూపర్’ విక్టరీ అందించాడు. అతడే సౌరభ్ నేత్రావల్కర్ (Saurabh Netravalkar). వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అతడు క్రికెట్పై మమకారంతో బంతి అందుకుని సంచలనం సృష్టించాడు. దీంతో సౌరభ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇంతకీ ఎవరీ నేత్రావల్కర్..?
ముంబయిలో పుట్టి.. భారత్కు ఆడి
భారత్కు చెందిన సౌరభ్ నరేశ్ నేత్రావల్కర్ 1991 అక్టోబరు 16న ముంబయిలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఆసక్తి పెంచుకోవడమే గాక భారత్ తరఫున అండర్ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జరిగిన ఈ టోర్నీలో టీమ్ఇండియా (Team India) సభ్యుడిగా ఉన్నాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయ్దేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబయికి రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. భారత్లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమ్ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు.
చదువు కోసం అమెరికా వెళ్లి..
ప్రొఫెషనల్ క్రికెట్లో అవకాశాలు రాకపోవడంతో తిరిగి చదువుపై దృష్టి సారించాడు. 23 ఏళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు. అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని ఎట్టకేలకు 2019లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్లు ఆడాడు.
టీ20 ప్రపంచకప్లో పెను సంచలనం.. పాక్పై అమెరికా ‘సూపర్’ విక్టరీ
నాటి ఓటమికి ప్రతీకారం..
టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్తో అమెరికా తలపడటం ఇదే తొలిసారి. నేత్రావల్కర్ (Software Engineer Saurabh Netravalkar)కు మాత్రం గతంలోనే బాబర్ జట్టును ఎదుర్కొన్న అనుభవం ఉంది. 2010 అండర్-19 ప్రపంచకప్ ఎడిషన్లో ఆడిన అతడు.. ఆ టోర్నీలో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం ఆరు మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ టోర్నీలో దాయాది చేతిలో భారత్కు ఓటమి ఎదురైంది. ఆ తర్వాత టీమ్ఇండియాకు దూరమైన సౌరభ్.. ఇప్పుడు అమెరికా జట్టులో ఆడి నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
గురువారం నాటి మ్యాచ్లోనూ నేత్రావల్కర్ పాక్ను అద్భుతంగా కట్టడి చేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్తో నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. వేసిన తొలి మూడు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చాడంటే బాబర్ జట్టును మనోడు ఎంత కంగారుపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా జట్టు తరఫున ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైన తర్వాత నేత్రావల్కర్ మాట్లాడుతూ..‘‘ఇది చాలా భావోద్వేగ క్షణం. ఉన్నత చదువుల కోసం బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశా. మళ్లీ క్రికెట్ ఆడుతానని కలలో కూడా ఊహించలేదు. నా క్రికెట్ షూ కూడా తెచ్చుకోలేదు’’ అని అన్నాడు. ప్రస్తుతం అతడు ఒరాకిల్ (Oracle)లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్