Bengaluru vs Hyderabad: అపజయాల ‘బెంగ’ళూరు ఎదుట.. హైదరా‘బాదుడే’ సవాల్..!
బెంగళూరు-హైదరాబాద్ జట్ల మధ్య నేటి మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయిని ఓడించింది.. చెన్నైకి చెక్ పెట్టింది.. పంజాబ్పై పంజా విసిరింది.. ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ ఆటతీరు అందరి మతి పోగొడుతోంది. మరోవైపు వరుస ఓటములతో కుదేలైన బెంగళూరు పరిస్థితి ఘోరంగా తయారైంది. పేపర్ పై చూస్తే.. స్టార్లకు కొదవేం లేని ఆ జట్టు అరడజను మ్యాచుల్లో ఒక్కటి మాత్రమే గెలవటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ జట్టు చిన్నస్వామి వేదికగా హైదరాబాద్తో తలపడేందుకు సిద్ధమైంది.
కళ్లన్నీ మ్యాక్స్వెల్పైనే..
బెంగళూరు ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు ఏడో మ్యాచ్. లీగ్ స్టేజ్లో సగం మ్యాచ్లు ఆడిన ఏకైక జట్టుగా అవతరించనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు ముగియకుండా.. సజీవంగా ఉండాలంటే బెంగళూరుకు ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే.
గత మ్యాచ్లో (ముంబయిపై) విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాక్స్వెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆసీస్ జాతీయ జట్టు తరఫున అదరగొట్టే అతడు.. బెంగళూరుకు ఒక్క నాణ్యమైన ఇన్నింగ్సూ ఆడలేదు. ఫలితంగా మీమ్స్ మెటీరియల్గా మారిపోయాడు.
ఇక వెటరన్ దినేశ్ కార్తిక్ దూకుడు కొనసాగుతోంది. ముంబయిపై డుప్లెసిస్, రజత్ పటీదార్ హాఫ్ సెంచరీలు సాధించి మళ్లీ ఫామ్లోకి రావడం బెంగళూరుకు సానుకూలాంశం. మ్యాక్సీ కూడా బ్యాట్తో మెరుపులు మెరిపిస్తే.. బెంగళూరుకు తిరుగుండదు. అయితే, హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్, భువి, నటరాజన్, జయ్దేవ్తో కూడిన పేస్ దళం ప్రత్యర్థులను కుదురుకోనీయడంలేదు. స్పిన్లో మయాంక్ మార్కండే, షహ్బాజ్ ఫర్వాలేదనిపిస్తున్నారు.
హైదరాబాద్ బ్యాటింగ్ X బెంగళూరు బౌలింగ్
హైదరాబాద్ దూకుడు ఆటతో ప్రత్యర్థులను వణికిస్తోంది. బ్యాటింగ్తోపాటు బౌలింగ్లోనూ అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, సమద్, నితీశ్ రెడ్డితో కూడిన బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. మరోవైపు బెంగళూరు బౌలింగ్ అత్యంత దారుణంగా ఉంది. అలాంటిది హైదరాబాద్ను ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సిరాజ్, విల్ జాక్స్, మ్యాక్స్వెల్, టోప్లీ, ఆకాశ్ దీప్ నాణ్యమైన బౌలింగ్ చేయాల్సిందే. విజయ్కుమార్ వైశాఖ్ ఒక్కడే అప్పుడప్పుడు ఫర్వాలేదనిపిస్తున్నాడు. ముంబయి, చెన్నై బౌలింగ్నే ఎదుర్కొని దూకుడుగా ఆడి హైదరాబాద్ బ్యాటింగ్ త్రయం పరుగులు రాబట్టింది. ఒకవేళ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసి 200+ స్కోరు చేసినా విజయం సాధించాలంటే మాత్రం బౌలింగ్ శ్రమించాల్సిందే. ముంబయితో మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘మేం 250+ స్కోరు చేస్తేనే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. మా బౌలింగ్ బలహీనంగా ఉందనేది వాస్తవం’ అని వ్యాఖ్యానించాడు. ఆ లోటును పూరించుకొని బరిలోకి దిగాలి.
గతం ఇలా.. పిచ్ అలా
బెంగళూరు - హైదరాబాద్ మొత్తం 22 మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ గణాంకాల్లో హైదరాబాద్దే పైచేయి. సన్రైజర్స్ 12 మ్యాచుల్లో విజయం సాధించగా.. బెంగళూరు 10 గెలిచింది. 2016లో ఆ జట్టును ఓడించే హైదరాబాద్ ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పిచ్ పరిస్థితికొస్తే.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. టాస్ నెగ్గే సారథి కచ్చితంగా లక్ష్య ఛేదనకే మొగ్గుచూపుతాడు. మంచు ప్రభావం కూడా కలిసొస్తుంది. భారీ టార్గెట్ను కూడా కాపాడుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తుది జట్లు (అంచనా)
బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), రీస్ టోప్లీ, విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, సిరాజ్
హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయ్దేవ్ ఉనద్కత్, నటరాజన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?