Buzzball: బజ్బాల్.. వరమా.. భారమా? ఇంగ్లాండ్ శైలిపై భిన్నాభిప్రాయాలు
తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యంతో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్కలమ్తో కలిసి బజ్బాల్కు శ్రీకారం చుట్టాడు.
బజ్బాల్.. బజ్బాల్.. బజ్బాల్.. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో దీని గురించి ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ టెస్టుల్లో అనుసరిస్తున్న ఈ శైలి టెస్టు క్రికెట్ రూపురేఖల్ని మార్చేస్తోందన్నది వాస్తవం. టెస్టుల్లో సంప్రదాయ శైలిలో నెమ్మదిగా ఆడడం వదిలేసి.. పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాక ఇంగ్లాండ్ సంచలన విజయాలను దక్కించుకుంది. ఇతర జట్లు కూడా ఆ జట్టును అనుసరించాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడప్పుడు బజ్బాల్ (Buzzball) వల్ల మొత్తం తలకిందులై అసలుకే మోసం వస్తోందన్న వాదనా లేకపోలేదు. భారత్ చేతిలో మూడో టెస్టులో (IND vs ENG) ఇంగ్లాండ్ చిత్తుగా ఓడడంతో ఇంగ్లాండ్ మీడియా ఆ జట్టు తీరును తూర్పారబడుతోంది.
అలా బజ్బాల్కు శ్రీకారం..
రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్కలమ్తో కలిసి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. బజ్బాల్ వ్యూహానికి శ్రీకారం చుట్టాడు. దీని ప్రకారం తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యం. టెస్టులంటే మామూలుగా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తారు. రన్రేట్ 3కు అటూఇటుగా ఉంటుంది. రన్రేట్ 3.5-4 మధ్య ఉంటే చాలా వేగంగా ఆడినట్లు లెక్క. కానీ ఇంగ్లాండ్ మాత్రం 5-6 రన్రేట్తో ఆడటం మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడడానికే ప్రాధాన్యమిచ్చింది. బౌలింగ్లోనూ ఇదే దూకుడును అనుసరించింది. ఎప్పుడూ వికెట్ కోసం ఎటాకింగ్ ఫీల్డ్ పెట్టడం.. అందుకు తగ్గట్లే బౌలింగ్ చేయడం.. ఇలా భిన్నమైన శైలిని అనుసరించింది. అలాగే ఓడినా పర్వాలేదు గెలుపు కోసం ప్రయత్నించడమే తప్ప డ్రా కోసం ఆడడం మానేసింది ఇంగ్లిష్ జట్టు.
కొనియాడిన వాళ్లే విమర్శించడంతో..
ఈ బజ్బాల్ శైలి వల్ల ఇంగ్లాండ్ చాలావరకు ప్రయోజనమే పొందింది. వరుసగా టెస్టులు, సిరీస్లు గెలిచింది. బజ్బాల్ శైలి వల్ల టెస్టులకు ఆకర్షణ పెరగడంతో దీన్ని చాలామంది క్రికెట్ ప్రియులు స్వాగతించారు. టెస్టు క్రికెట్కు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతున్న రోజుల్లో ఇంగ్లాండ్ సంప్రదాయ ఫార్మాట్కు జీవం పోస్తోందని ఆ జట్టుపై ప్రశంసలు కూడా కురిశాయి. కానీ సానుకూల ఫలితాలు వచ్చినపుడు ఒక విధానాన్ని కొనియాడేవాళ్లే.. ఫలితాలు ప్రతికూలమైనపుడు విమర్శించడం సహజం. ‘బజ్బాల్’ విషయంలోనూ అదే జరుగుతోంది.
గత ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు తొలి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 393-8 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి ఇంకా రూట్ క్రీజులో ఉన్నాడు. సాధారణంగా తొలి ఇన్నింగ్స్లో ఆలౌటయ్యే వరకు ఆడుతుంది ఏ జట్టైనా. మరీ స్కోరు 500 దాటితే కానీ డిక్లేర్ చేయదు. అది కూడా రెండో రోజు ఆ పని చేస్తారు. కానీ తొలి రోజు ఇంకా ఆట పూర్తి కాకముందే, రూట్ లాంటి బ్యాటర్ క్రీజులో ఉండగానే ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తప్పుకి ఓటమి రూపంలో మూల్యం చెల్లించుకుంది.
బజ్బాల్ పేరుతో వెర్రి ఆలోచన చేశారంటూ స్టోక్స్, మెక్కలమ్ జోడీపై ఇంగ్లాండ్ అభిమానులు, మాజీల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ నిర్ణయాలు విమర్శలకు దారి తీశాయి. ఇక ప్రస్తుత భారత్ సిరీస్ విషయానికి వస్తే.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలవగా.. అంత పెద్ద ఛేదన అసాధ్యం కాబట్టి మిగిలిన ఒకటిన్నర రోజు నెమ్మదిగా ఆడి మ్యాచ్ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందని.. కానీ దూకుడుగా ఆడి కేవలం 122 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుందని ఆ జట్టుపై స్వదేశీ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కొందరు మాజీలు కూడా ఆ జట్టు ఆటతీరును తప్పుబడుతున్నారు.
రూట్ లాంటి మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మన్.. బజ్బాల్ శైలికి అలవాటుపడే క్రమంలో తన సహజ శైలిని కోల్పోయాడని.. ఫామ్ను కూడా దెబ్బ తీసుకున్నాడని.. ఇది బజ్బాల్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్ అని విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తమకు అద్భుత విజయాలు అందించిన బజ్బాల్ విషయంలో తగ్గేదే లేదంటోంది. సిరీస్లో మిగతా మ్యాచ్ల్లోనూ బజ్బాల్ శైలినే కొనసాగిస్తామని.. ఒకట్రెండు ప్రతికూల ఫలితాలు తమ ఆలోచనను మార్చలేవని.. సిరీస్లో కచ్చితంగా పుంజుకుంటామని అంటున్నాడు ఆ జట్టు కోచ్ మెక్కలమ్. మరి ఈ శైలి అంతిమంగా ఇంగ్లిష్ జట్టుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
-ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్