Buzzball: బజ్బాల్.. వరమా.. భారమా? ఇంగ్లాండ్ శైలిపై భిన్నాభిప్రాయాలు
తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యంతో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్కలమ్తో కలిసి బజ్బాల్కు శ్రీకారం చుట్టాడు.
బజ్బాల్.. బజ్బాల్.. బజ్బాల్.. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో దీని గురించి ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ టెస్టుల్లో అనుసరిస్తున్న ఈ శైలి టెస్టు క్రికెట్ రూపురేఖల్ని మార్చేస్తోందన్నది వాస్తవం. టెస్టుల్లో సంప్రదాయ శైలిలో నెమ్మదిగా ఆడడం వదిలేసి.. పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాక ఇంగ్లాండ్ సంచలన విజయాలను దక్కించుకుంది. ఇతర జట్లు కూడా ఆ జట్టును అనుసరించాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడప్పుడు బజ్బాల్ (Buzzball) వల్ల మొత్తం తలకిందులై అసలుకే మోసం వస్తోందన్న వాదనా లేకపోలేదు. భారత్ చేతిలో మూడో టెస్టులో (IND vs ENG) ఇంగ్లాండ్ చిత్తుగా ఓడడంతో ఇంగ్లాండ్ మీడియా ఆ జట్టు తీరును తూర్పారబడుతోంది.
అలా బజ్బాల్కు శ్రీకారం..
రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్కలమ్తో కలిసి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. బజ్బాల్ వ్యూహానికి శ్రీకారం చుట్టాడు. దీని ప్రకారం తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యం. టెస్టులంటే మామూలుగా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తారు. రన్రేట్ 3కు అటూఇటుగా ఉంటుంది. రన్రేట్ 3.5-4 మధ్య ఉంటే చాలా వేగంగా ఆడినట్లు లెక్క. కానీ ఇంగ్లాండ్ మాత్రం 5-6 రన్రేట్తో ఆడటం మొదలుపెట్టింది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దూకుడుగా ఆడడానికే ప్రాధాన్యమిచ్చింది. బౌలింగ్లోనూ ఇదే దూకుడును అనుసరించింది. ఎప్పుడూ వికెట్ కోసం ఎటాకింగ్ ఫీల్డ్ పెట్టడం.. అందుకు తగ్గట్లే బౌలింగ్ చేయడం.. ఇలా భిన్నమైన శైలిని అనుసరించింది. అలాగే ఓడినా పర్వాలేదు గెలుపు కోసం ప్రయత్నించడమే తప్ప డ్రా కోసం ఆడడం మానేసింది ఇంగ్లిష్ జట్టు.
కొనియాడిన వాళ్లే విమర్శించడంతో..
ఈ బజ్బాల్ శైలి వల్ల ఇంగ్లాండ్ చాలావరకు ప్రయోజనమే పొందింది. వరుసగా టెస్టులు, సిరీస్లు గెలిచింది. బజ్బాల్ శైలి వల్ల టెస్టులకు ఆకర్షణ పెరగడంతో దీన్ని చాలామంది క్రికెట్ ప్రియులు స్వాగతించారు. టెస్టు క్రికెట్కు ఆదరణ అంతకంతకూ తగ్గిపోతున్న రోజుల్లో ఇంగ్లాండ్ సంప్రదాయ ఫార్మాట్కు జీవం పోస్తోందని ఆ జట్టుపై ప్రశంసలు కూడా కురిశాయి. కానీ సానుకూల ఫలితాలు వచ్చినపుడు ఒక విధానాన్ని కొనియాడేవాళ్లే.. ఫలితాలు ప్రతికూలమైనపుడు విమర్శించడం సహజం. ‘బజ్బాల్’ విషయంలోనూ అదే జరుగుతోంది.
గత ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా తొలి టెస్టు తొలి రోజు దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ 393-8 వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి ఇంకా రూట్ క్రీజులో ఉన్నాడు. సాధారణంగా తొలి ఇన్నింగ్స్లో ఆలౌటయ్యే వరకు ఆడుతుంది ఏ జట్టైనా. మరీ స్కోరు 500 దాటితే కానీ డిక్లేర్ చేయదు. అది కూడా రెండో రోజు ఆ పని చేస్తారు. కానీ తొలి రోజు ఇంకా ఆట పూర్తి కాకముందే, రూట్ లాంటి బ్యాటర్ క్రీజులో ఉండగానే ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తప్పుకి ఓటమి రూపంలో మూల్యం చెల్లించుకుంది.
బజ్బాల్ పేరుతో వెర్రి ఆలోచన చేశారంటూ స్టోక్స్, మెక్కలమ్ జోడీపై ఇంగ్లాండ్ అభిమానులు, మాజీల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కొన్ని మ్యాచ్ల్లోనూ ఇంగ్లాండ్ నిర్ణయాలు విమర్శలకు దారి తీశాయి. ఇక ప్రస్తుత భారత్ సిరీస్ విషయానికి వస్తే.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలవగా.. అంత పెద్ద ఛేదన అసాధ్యం కాబట్టి మిగిలిన ఒకటిన్నర రోజు నెమ్మదిగా ఆడి మ్యాచ్ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాల్సిందని.. కానీ దూకుడుగా ఆడి కేవలం 122 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుందని ఆ జట్టుపై స్వదేశీ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కొందరు మాజీలు కూడా ఆ జట్టు ఆటతీరును తప్పుబడుతున్నారు.
రూట్ లాంటి మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మన్.. బజ్బాల్ శైలికి అలవాటుపడే క్రమంలో తన సహజ శైలిని కోల్పోయాడని.. ఫామ్ను కూడా దెబ్బ తీసుకున్నాడని.. ఇది బజ్బాల్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్ అని విమర్శిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తమకు అద్భుత విజయాలు అందించిన బజ్బాల్ విషయంలో తగ్గేదే లేదంటోంది. సిరీస్లో మిగతా మ్యాచ్ల్లోనూ బజ్బాల్ శైలినే కొనసాగిస్తామని.. ఒకట్రెండు ప్రతికూల ఫలితాలు తమ ఆలోచనను మార్చలేవని.. సిరీస్లో కచ్చితంగా పుంజుకుంటామని అంటున్నాడు ఆ జట్టు కోచ్ మెక్కలమ్. మరి ఈ శైలి అంతిమంగా ఇంగ్లిష్ జట్టుకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
-ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి