ODI World Cup: ఆ రెండు వేదికలను మార్చాలని పాక్ ఎందుకు కోరుతోంది..? కారణం ఇదేనా..?
వన్డే ప్రపంచకప్(ODI World Cup 2023) ముసాయిదా షెడ్యూల్ విడుదలైంది. అయితే.. పాక్(Pakistan) ముఖ్యంగా రెండు వేదికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణాలను పరిశీలిస్తే..
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది చివర్లో భారత్లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) ఇటీవల ముసాయిదా షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ముసాయిదా షెడ్యూల్పై దాయాది పాకిస్థాన్ (Pakistan) కాస్త అసౌకర్యానికి గురవుతున్నట్లు సమాచారం.
ఈ మెగా టోర్నీ తుది షెడ్యూల్ను ప్రకటించే ముందు.. సభ్య దేశాల నుంచి సూచనలు, సలహాలను ఐసీసీ(ICC) కోరింది. అయితే పాక్ క్రికెట్ బోర్డు(PCB) ఈ షెడ్యూల్పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ అందించిన ఈ ముసాయిదా షెడ్యూల్ను పరిశీలించి పాక్ ఆడే వేదికలను ఆమోదించే పనిని పీసీబీ.. డేటా అనలిటిక్స్, బోర్డు వ్యూహకర్తలకు అప్పగించింది. అయితే.. ఇందులో ముఖ్యంగా రెండు వేదికలపై పాక్ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. అఫ్గానిస్థాన్తో తలపడే చెన్నై వేదిక, ఆస్ట్రేలియాతో తలపడే బెంగళూరు వేదికలు తమకు అనుకూలం కావంటూ వారు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే..?
స్పిన్నర్లకు సహకరించే చెన్నై పిచ్పై రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లాంటి బలమైన బౌలర్లను పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఇప్పటికే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు మెరుగైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బెంగళూరు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. దీనిపై పెద్ద జట్టయిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం సవాలే. పిచ్ పరిస్థితులు, ఇతర విషయాల్లో పాక్ సవాళ్లు ఎదుర్కొనే వేదికల్లోనే కావాలని మ్యాచ్లు ఆడేలా భారత్ షెడ్యూల్ రూపొందించిందని పీసీబీ ప్రతినిధులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే పీసీబీ వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ కోరుతున్నట్లు తెలిసింది.
బలమైన కారణం ఉంటేనే..
ప్రయాణాలకు సంబంధించిన సూచనల కోసమే.. ప్రొటోకాల్ ప్రకారం సభ్య దేశాలకు ముసాయిదా షెడ్యూల్ పంపించడం జరిగిందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు. వేదికలను మార్చాలంటే.. అందుకు బలమైన కారణం ఉండాలని స్పష్టం చేశారు. ‘భద్రతా కారణాలతో సభ్య దేశం.. తమ వేదికను మార్చాలని ఒత్తిడి తీసుకురావొచ్చు. టీ20 ప్రపంచకప్-2016 సమయంలో పాక్.. భారత్లో పర్యటించేందుకు ఇలాగే కోరింది. కానీ.. జట్టు బలాలు, బలహీనతలను బట్టి వేదికలను మార్చడం కుదరదు. అలా అయితే.. షెడ్యూల్ను రూపొందించడం కష్టతరమవుతుంది’ అంటూ ఆ ప్రతినిధి తెలిపారు. 2016లో భారత్-పాక్ ఆడిన మ్యాచ్ను భద్రతా కారణాల రీత్యా ధర్మశాల నుంచి కోల్కతాకు మార్చిన విషయం తెలిసిందే. దీంతో బలమైన కారణం ఉంటే తప్పితే.. వేదికలను మార్చడం కుదరదని ఆ ప్రతినిధి చెప్పాడు.
ఇక ముసాయిదా షెడ్యూల్ ప్రకారం.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ (IND vs PAK) మధ్య అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన