Ind vs Pak: భారత్ X పాక్ మాత్రమే ప్రత్యేకమా?... ప్రపంచకప్లో అసమానత్వంపై చర్చ!
వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్న బీసీసీఐ, ఐసీసీ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్లో అత్యున్నత టోర్నీ అయిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఇటీవలే ప్రారంభమైంది. అంత ప్రతిష్ఠాత్మక టోర్నీ మొదలవుతుంటే, మ్యాచ్ ఆరంభానికి చిన్న వేడుక కూడా చేయలేదు నిర్వాహకులు. గత ప్రపంచకప్లో ఫైనల్ ఆడిన రెండు జట్లు తలపడుతుంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం ప్రేక్షకులు లేక వెలవెలబోయింది. ఆ మ్యాచ్ను అలా పట్టించుకోకుండా వదిలేసి, టోర్నీ మొదలైన ఎనిమిది రోజులకు అదే మైదానంలో భారత్ - పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారన్న వార్తలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీశాయి.
ఆట ఏదైనా సరే ప్రపంచకప్ అంటే, అందులో భాగమైన అన్ని దేశాలకు సమాన అవకాశాలు కల్పించే టోర్నీ. ఒక జట్టు ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావనకు అందులో అవకాశమే ఉండకూడదు. నిబంధనల నుంచి అన్నీ అందరికీ సమానంగానే ఉండాలి. కానీ భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్లో సమన్యాయం కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా భారత అభిమానులే ఈ విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ను సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారని, ఈ పోరును ‘రొమాంటిసైజ్’ చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ జట్టును ప్రత్యేకంగా చూస్తుండటం, ఆ జట్టుతో మ్యాచ్ను సెలబ్రేట్ చేస్తుండటాన్ని తప్పుబడుతూ ఈ మ్యాచ్ను బహిష్కరించాలంటూ ట్విటర్లో ట్రెండ్ కూడా చేస్తుండటం గమనార్హం.
ఆ మ్యాచ్ను అలా వదిలేసి..
ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ముంగిట ఆరంభ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ మ్యాచ్లో తలపడే జట్లు ఏవైనా సరే, భారీ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం ఏ హడావుడి లేకుండా టోర్నీని మొదలుపెట్టేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడ్డ ఈ మ్యాచ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లేక వెలవెలబోయింది. మ్యాచ్ ఆరంభ సమయానికి పదో వంతు కూడా స్టేడియం నిండలేదు. ఒక ఇన్నింగ్స్ అయ్యేసరికి మూడోవంతు జనం కనిపించారు. టీ20ల ప్రభావంతో కొన్నేళ్లుగా వన్డేలకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ స్థితిలో క్రికెట్ను అమితంగా ఇష్టపడే భారత్లో ప్రపంచకప్ నిర్వహించడం ఈ ఫార్మాట్కు మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని టోర్నీ పట్ల అభిమానుల్లో ఆసక్తి పెంచాల్సిన ఐసీసీ, బీసీసీఐ అలక్ష్యం వహించాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్కు స్టేడియం చాలా వరకు ఖాళీగా కనిపించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. తొలి వారం రోజుల్లో భారత జట్టు ఆడినవి మినహా చాలా మ్యాచ్లకు ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగానే కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శనివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో నిర్వాహకులు చేస్తున్న ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సహజంగానే భారత్-పాక్ మ్యాచ్పై అందరిలో అమితాసక్తి ఉంటుంది. సులువుగా స్టేడియాలు నిండిపోతాయి. టీవీల్లోనూ కోట్లాది మంది ఈ మ్యాచ్ను చూస్తారు. దీనికి ప్రత్యేక ఆకర్షణలేవీ జోడించాల్సిన అవసరం లేదు. కానీ బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్కు ముందు భారీ స్థాయిలో సంగీత విభావరి నిర్వహిస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేక అతిథులుగా రప్పించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించింది. ఆరంభ మ్యాచ్ను పట్టించుకోకుండా వదిలేసి.. టోర్నీ మొదలైన తొమ్మిది రోజుల తర్వాత భారత్-పాక్ మ్యాచ్కు మాత్రం ఇంత హడావుడి చేయడమేంటనే ప్రశ్న క్రికెట్ ప్రపంచం నుంచి ఉత్పన్నమవుతోంది. ఇది మిగతా జట్ల పట్ల చిన్నచూపునకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.
ఆసియా కప్లో అలా..
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పట్ల అభిమానుల్లో ఉండే ఆసక్తిని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా బీసీసీఐ, ఇతర క్రికెట్ పాలకుల తీరు ఉంటోందన్నది కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. ఈ రెండు జట్లు ప్రపంచకప్, ఆసియాకప్.. ఇలా ఏ టోర్నీలో తలపడ్డా ప్రపంచవ్యాప్తంగా పదుల కోట్లమంది టీవీల్లో వీక్షిస్తారు. ఆదాయం భారీ స్థాయిలో ఉంటుంది. 2012 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆగిపోవడంతో ప్రపంచకప్, ఆసియాకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో ఇరు జట్లు తలపడ్డపుడు అందరి చూపూ ఆ మ్యాచ్ల మీదే ఉంటోంది. అందుకే ఆరు దేశాలే తలపడే ఆసియా కప్లో ఈ రెండు జట్లూ రెండు మూడు సార్లు తలపడేలా ఫార్మాట్ రూపొందిస్తున్నారు.
ఇటీవల శ్రీలంకలో జరిగిన ఆసియాకప్లో రెండు జట్ల మధ్య లీగ్ మ్యాచ్ వర్షం వల్ల మధ్యలో ఆగిపోయింది. తర్వాత సూపర్-4 దశలో ఈ రెండు జట్ల పోరుకు కూడా వర్షం ముప్పు ఉండడంతో ప్రత్యేకంగా రిజర్వ్ డే కేటాయించారు. ఇది టోర్నీ మధ్యలో తీసుకున్న నిర్ణయం. వేరే మ్యాచ్లకు కూడా వర్షం ముప్పున్నా, వాటికి మాత్రం నిర్వాహకులు రిజర్వ్ డే కేటాయించలేదు. ఈ విషయమై ఇతర జట్ల నుంచి కొంత అసంతృప్తి కూడా వ్యక్తమైంది. అయితే బీసీసీఐ అర్థ బలం దృష్ట్యా ఈ పక్షపాతాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద క్రికెట్ దేశాలు కూడా మౌనం వహిస్తున్నాయి. కానీ పది దేశాలు తలపడుతున్న ప్రపంచకప్లో రెండు జట్లను మాత్రమే ప్రత్యేకంగా చూడడం టోర్నీ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తుందనే అభిప్రాయాలు సగటు క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు