Soft Signal: గిల్ ఔటుతో మరోసారి ‘సాఫ్ట్ సిగ్నల్’ చర్చలోకి..!
భారత బ్యాటర్ శుభమన్ గిల్ ఔటు పెను దుమారానికి దారితీసింది. బంతి నేలను తాకినట్లు కనిపించినా థర్డ్ అంపైర్ ఔటు ఇవ్వడంతో అభిమానులు మండిపడుతున్నారు. సాఫ్టసిగ్నల్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో అని వాపోతున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్లో సాఫ్ట్ సిగ్నల్(Soft Signal) అంశం మరోసారి చర్చలో నిలిచింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో తొలివికెట్గా గిల్ (Shubman Gill) వెనుదిరిగాడు. బోలాండ్ వేసిన బంతి గిల్ బ్యాట్ను ముద్దాడి గల్లీలో ఉన్న గ్రీన్ వైపు వెళ్లింది. నేలకు అత్యంత సమీపంలో గ్రీన్ దీనిని అందుకొన్నాడు. ఆసీస్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఫీల్డ్ అంపైర్లు మాత్రం అనుమానంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. ఇక్కడ స్వచ్ఛందగా ఫీల్డ్ అంపైర్లే థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. టీవీ రీప్లేలో కూడా బంతి నేలను తాకినట్లు కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం ఆసీస్ పక్షం వహించాడు. దీంతో చేసేది లేక.. గిల్ తొలివికెట్గా పెవిలియన్కు చేరుకోవాల్సి వచ్చింది.
సాఫ్ట్ సిగ్నల్ నిబంధన అమల్లో ఉంటే గిల్ కచ్చితంగా నాటౌట్గా తేలేవాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. వాస్తవానికి ఈ నిబంధన అమల్లో ఉంటే.. గిల్ క్యాచ్ విషయంలో గందరగోళానికి గురైన అంపైర్లు నాటౌట్గా సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఔట్ అనడానికి పక్కా ఆధారం గిల్ విషయంలో థర్డ్ అంపైర్కు లభించే అవకాశం లేదు. దీంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి మద్దతు తెలపాల్సి వచ్చేదని అభిమానులు భావించారు.
వాస్తవానికి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను ఈ నెల నుంచే ఐసీసీ తొలగించింది. ఈ మేరకు ఐసీసీ నియమించిన ఓ కమిటీ సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. దీనిలో భారత్ మాజీ బ్యాటర్ గంగూలీ కూడా సభ్యుడు. సాఫ్ట్ సిగ్నల్ ప్రక్రియ సుదీర్ఘంగా ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది. ఈ నిబంధన అనవసరమైన గందరగోళం పరిస్థితులు సృష్టిస్తోందని గంగూలీనే ఓ సందర్భంలో వెల్లడించాడు.
ఏమిటీ సాఫ్ట్ సిగ్నల్
ఇన్ని రోజులు బంతిని ఆటగాళ్లు సరిగ్గా అందుకున్నారా? లేదా నేలకు తాకిందా? అనే అనుమానం ఉన్న క్యాచ్ల విషయంలో మైదానంలోని అంపైర్లు ఔట్ లేదా నాటౌట్ను ‘సాఫ్ట్ సిగ్నల్’గా చూపిస్తూ.. టీవీ అంపైర్ను తుది నిర్ణయం తీసుకోవాలని అడిగేవాళ్లు. రీప్లేలో పరిశీలించిన తర్వాత స్పష్టత లేకుంటే, గందరగోళ పరిస్థితుల్లో మైదానంలోని అంపైర్ తీసుకున్న ‘సాఫ్ట్ సిగ్నల్’ను సమర్థిస్తూ టీవీ అంపైర్ నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాటౌట్లా కనిపించినప్పటికీ మైదానంలోని అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ఔట్గా ఇవ్వడం, టీవీ అంపైర్ దీన్ని సమర్థించడం చాలా సార్లు వివాదాస్పదమైంది. ఈ నిబంధన రెండువైపులా పదునైన కత్తిలా ఉండటంతో తొలగించి.. గందరగోళం విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయానికి పెద్దపీట వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
-
పుతిన్ కీలక నిర్ణయం.. రక్షణ మంత్రిగా షోయిగు తొలగింపు
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
-
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్