IPL 2024: భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 17లో రికార్డు స్కోర్లు ఉన్నాయ్... భారీ సిక్స్లూ ఉన్నాయ్.. కళ్లు చెదిరే క్యాచ్లూ ఉన్నాయ్... కానీ మజా మాత్రం లేదు. ఏ ఐపీఎల్ అభిమానిని అడిగినా ఇదే మాట అంటున్నారు. ఐపీఎల్ (IPL)లో మజా ఎందుకు మిస్ అయ్యింది?
- టీ20 క్రికెట్ అంటేనే బ్యాట్ వర్సెస్ బాల్. భారీ సిక్స్ కొట్టాక.. వికెట్ పడితే మజా వస్తుంది. బౌలర్ తెలివైన బంతికి... బ్యాటర్ సమయస్ఫూర్తి బ్యాటింగ్ పోటీగా నిలవాలి. కానీ ఈ ఐపీఎల్లో 200+ స్కోర్లు తప్ప వికెట్ల రాక కనిపించడం లేదు. గత 12 మ్యాచుల్లో పదింట 200+ స్కోర్లు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
- ఐపీఎల్ గత సీజన్లను పరిశీలిస్తే సూపర్ ఓవర్లు, డబుల్ సూపర్ ఓవర్లు, హ్యాట్రిక్లు కనిపించేవి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు అలాంటి జాడే లేదు. దీంతో ప్రతి మ్యాచు ఒకే తరహాలో ముగుస్తోందనే భావన ఏర్పడింది.
- అత్యధిక పరుగుల రికార్డులు తప్ప.. ఈ ఏడాది మరే ఇతర రికార్డులు బద్ధలవ్వడం లేదు. ఆరెంజ్ క్యాప్ గురించి జరుగుతున్న చర్చ.. పర్పుల్ క్యాప్ గురించి ఎక్కడా వినిపించడం లేదు. దీంతో ఓన్లీ బ్యాటర్ గేమ్ అనే పరిస్థితి ఏర్పడింది.
- అందరూ కలసి 200+ స్కోరు కొట్టారా లేదా అనే లెక్క తప్ప... క్రిస్ గేల్ (175) వ్యక్తిగత స్కోరు రికార్డు స్కోరు బద్ధలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్రికెట్ ఎంత టీమ్ గేమ్ అయినా వ్యక్తిగత రికార్డులు టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తాయి.
- పాయింట్ల పట్టిక టాప్ 4 ఒకసారి చూడండి... ఆదివారం రాత్రి వరకు ఒక్కటంటే ఒక్కటీ స్టార్ టీమ్ లేదు. ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇలా స్టార్ ప్లేయర్లున్న టీమ్లు టాప్లో ఉంటే.. చూసేవాళ్లకు మజా ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి ఏమన్నా మార్పు ఉంటుందేమో చూడాలి.
- టీమ్ల కంటే వాటి కెప్టెన్ల పేరుతోనే జట్లు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంటాయి. ఇప్పటికే బెంగళూరు టీమ్ అంటే కోహ్లీ ఫొటోనే వాడుతుంటారు. అయితే ఈ సారి చూస్తే రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (గతంలోనే) నాయకత్వం నుంచి పక్కకొచ్చేశారు. దీంతో ఆ ఆసక్తీ తగ్గిపోయింది.
- టీ20 క్రికెట్ అంటే ఓన్లీ క్రికెట్ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో చిన్న మసాలా కావాలి. ఉదాహరణకు గతంలో విరాట్ - నవీనుల్ హక్ - గంభీర్ మధ్య జరిగిన చర్చ మీకు గుర్తుండే ఉంటుంది. స్లెడ్జింగ్ సంగతి సరేసరి. ఈ ఏడాది ఆ మసాలాలు ఏమీ లేవు. దీంతో చప్పగా ఉంది అనేవారూ ఉన్నారు.
- ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకొచ్చి టీమ్ను గెలిపిస్తే మజా ఉంటుంది. అయితే ఆ విన్నింగ్ రింకు సింగ్ స్టైల్లో ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టేలా ఉంటే ఇంకా మజా ఉంటుంది. ఈ ఏడాది ఆ మ్యాజిక్ లేదు. ఛేజింగ్లో ఆఖరి ఓవర్ ఫైర్ వర్క్స్ మిస్ అయ్యేసరికి ఆసక్తి తగ్గిపోయింది.
- రోహిత్ చెప్పినట్లు 11 మంది ఆట 11 మందే ఆడాలి. 12వ ప్లేయర్ వచ్చేసరికి... ఏదో తేడా కొడుతోంది. మ్యాజిక్ తగ్గించేసింది అని చెప్పాలి. మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు ఆడేవాళ్లు మ్యాచ్ను మలుపు తిప్పాలి కానీ ఒక ఇన్నింగ్స్ డగౌట్లో కూర్చునే వాళ్లు కాదు.
- ఇక ప్రతి నాలుగైదు బంతులకు బౌండరీ బాదడం ఓకే.. అయితే దీని కోసమే బౌండరీ లైన్స్ కుదించారనే విమర్శలూ వస్తున్నాయి. ఇవి టీ20 మజాను చంపేసేవే. బౌండరీ దగ్గరకు బంతి వెళ్లాలి కానీ.. బౌండరీ లైన్ ముందుకు జరగకూడదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
నిపుణులు, స్టార్ క్రికెటర్లు, మాజీలు చేస్తున్న సూచనలను పరిశీలనలోకి తీసుకొని ఐపీఎల్ పాలకవర్గం ఏమన్నా మార్పులు చేస్తే వచ్చే ఐపీఎల్ అయినా మజానిస్తుంది. లేదంటే కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?