WPL 2024: ఈ WPLలో తెలుగమ్మాయిలు మెరుస్తారా?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ నేడే మొదలవుతోంది. ఈ లీగ్లో తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతారా?
ఏటా దేశంలో క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే టోర్నీ.. ఐపీఎల్. 16 ఏళ్లుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ లీగ్.. మరో నెల రోజుల్లో కొత్త సీజన్తో రాబోతోంది. ఈలోపు క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచడానికి మేమూ ఉన్నాం అంటూ వస్తున్నారు అమ్మాయిలు. గతేడాదే మొదలైన మహిళల ప్రిమియర్ లీగ్ (WPL 2024)లో రెండో సీజన్ నేడు మొదలవుతోంది. దీనిలో సత్తా చాటడానికి తెలుగు అమ్మాయిలు కూడా సై అంటున్నారు.
పొదుపుగా.. వేగంతో
డబ్ల్యూపీఎల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న తెలుగు అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వారిలో ఎక్కువ అంచనాలున్నది యువ పేసర్ అంజలి శర్వాణి మీదే. కొన్ని నెలల కిందటే ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుపై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఇప్పటిదాకా ఆమె 6 మ్యాచ్లాడి 3 వికెట్లు పడగొట్టింది. వికెట్ల సంఖ్య పరంగా తక్కువే అయినా.. పొదుపుగా, మంచి వేగంతో బౌలింగ్ చేసి ఆకట్టుకుంది. ఆమె డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. తెలుగు క్రికెటర్లలో అత్యధిక ధర దక్కించుకున్నది ఆమే. రూ.55 లక్షలకు యూపీ సొంతమైన ఆమె.. తొలి సీజన్లో 9 మ్యాచ్లాడి 4 వికెట్లు పడగొట్టింది. ఇప్పుడు అంతర్జాతీయ అనుభవంతో డబ్ల్యూపీఎల్లో అడుగు పెడుతున్న అంజలిని యూపీ ప్రధాన బౌలర్లలో ఒకరిగా చూడబోతున్నాం. ఈ సీజన్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని భావిస్తున్నారు.
డీసీ ధీమా.. మేఘన కొత్తగా
ఇప్పటికే భారత జట్టుకు 26 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన సీనియర్ పేసర్ అరుంధతి రెడ్డి.. డబ్ల్యూపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ సభ్యురాలు. ఆమెను రూ.30 లక్షలకు కొనుక్కుంది డీసీ. కానీ తొలి సీజన్లో ఆమె నిరాశపరిచింది. 7 మ్యాచ్ల్లో 2 వికెట్లే తీసింది. తన బౌలింగ్కు మెరుగులు దిద్దుకుని వస్తున్న అరుంధతి ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తానన్న ధీమాతో ఉంది. భారత జట్టుకు 3 వన్డేలు, 17 టీ20లు ఆడిన సబ్బినేని మేఘన దూకుడైన బ్యాటర్. రూ.30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ ఆమెను కొనుగోలు చేసింది. ఓపెనింగ్లో దూకుడుగా ఆడే మేఘన.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో అంచనాలను అందుకోలేకపోయింది. 6 మ్యాచ్లాడి 81 పరుగులు చేసింది. టీ20లకు అవసరమైన హిట్టింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ నిలకడ కొరవడిన మేఘన.. రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారింది. అక్కడ ఆమె ఏమేర రాణిస్తుందో చూడాలి.
సీనియర్ సుల్తానా.. రికార్డుల దీప్తి
టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్లు ఆడిన తెలుగుమ్మాయిల్లో గౌహర్ సుల్తానా ఒకరు. ఈ హైదరాబాద్ స్పిన్నర్.. 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. ఒకప్పుడు ఆమె భారత జట్టులో రెగ్యులర్ క్రికెటర్. కానీ, తర్వాత చోటు కోల్పోయింది. ఈ మధ్య దేశవాళీల్లో కూడా తక్కువగానే ఆడుతోంది. 35 ఏళ్ల గౌహర్.. యూపీకి ఆడుతోంది. తొలి సీజన్లో ఆమెకు అవకాశం దక్కలేదు. ఈసారి తుది జట్టులో స్థానం దక్కితే సత్తా చాటాలని చూస్తోంది. నిరుడు 10 లక్షలతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసిన యశశ్రీకి ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అందులో ఒక వికెట్ పడగొట్టింది. ఈ హైదరాబాదీ పేసర్కు మరో అవకాశం రాలేదు. మంచి వేగంతో బౌలింగ్ చేసే యశశ్రీ ఈసారి తనకు తగినన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది.
2013లో 16 ఏళ్ల వయసులోనే టీ20 మ్యాచ్ ఆడి భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది స్నేహ దీప్తి. తర్వాత షెఫాలీ వర్మ ఆమె రికార్డును బద్దలు కొట్టింది. అయితే భారత్కు ఆడిన 2 టీ20లు, ఒక వన్డేలో ఆమె సత్తా చాటకపోవడంతో చోటు కోల్పోయింది. డబ్ల్యూపీఎల్లో ఈ ఏపీ బ్యాటర్ దిల్లీ క్యాపిటల్స్ సభ్యురాలు. తొలి సీజన్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఆమెకు.. ఈసారి అవకాశం వస్తుందేమో చూడాలి.
ఇంకా మీడియం పేసర్ షబ్నం షకిల్ (గుజరాత్ జెయింట్స్), బ్యాటర్ త్రిష పూజిత (గుజరాత్ జెయింట్స్) కూడా లీగ్లో అవకాశం లభిస్తే సత్తా చాటాలని చూస్తున్నారు. మరి వీరిలో లీగ్ ముగిసేనాటికి ఎంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తాయో చూడాలి.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్