T20 World Cup 2024: చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నా.. నువ్వు వరల్డ్ కప్లో ఆడు: ఆండ్రి రస్సెల్
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. దాదాపు 20 దేశాలు కప్ కోసం తలపడే టీ20 ప్రపంచ కప్ సందడి వచ్చే నెల నుంచి ఆరంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన తర్వాత విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలు కానుంది. ఇప్పటికే ప్రాథమికంగా జట్లను ప్రకటించినప్పటికీ.. ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఈ నెల 25 వరకు సమయం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్లో అదరగొట్టేస్తున్న విండీస్ ఆటగాడు సునీల్ నరైన్కు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఆండ్రి రస్సెల్ చివరిసారిగా ఓ విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న పొట్టి కప్లో ఆడితే బాగుంటుందని కోరాడు.
‘‘ఐపీఎల్లో నరైన్ ప్రదర్శన చూసిన తర్వాతే.. చాలా సంతోషించా. గౌతమ్ గంభీర్ వచ్చాక మాకు మరింత ఉత్సాహం వచ్చింది. నరైన్తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని పట్టుబట్టాడు. గత సీజన్లలో అతడిని 9 లేదా 10వ స్థానంలో ఆడించాం. అక్కడ అతడి అవసరం పెద్దగా లేదు. ఈసారి ఓపెనర్గా తనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఓ బౌలర్ దాదాపు 500 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. ఇటు బౌలింగ్లోనూ 16 వికెట్లనూ పడగొట్టాడు. ఆల్రౌండ్ ప్రతిభతో కోల్కతా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ నిర్ణయం వల్లే అతడికి ప్రమోషన్ లభించింది.
ఈ స్థాయి ఫామ్లో ఉన్న నరైన్ను టీ20 ప్రపంచ కప్లోనూ చూడాలనేది నా కోరిక. గతంలో మా జట్టును ప్రకటించే సమయంలోనూ చాలా చెప్పి చూశా. దాదాపు రెండు వారాలపాటు అతడితో మాట్లాడుతూనే ఉన్నాం. ‘ప్లీజ్.. ఈ వరల్డ్ కప్లో ఆడు. ఆ తర్వాత నువ్వు రిటైర్ అయినా ఫర్వాలేదు. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’ అని విజ్ఞప్తి చేశాం. అప్పటికే అతడు ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. దానిని మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా మార్చుకొని ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుంది’’ అని రస్సెల్ వ్యాఖ్యానించాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా గ్రూప్ ఎలో భారత్, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. -
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
తాజా వార్తలు (Latest News)
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?