T20 World Cup 2024: చివరిసారిగా విజ్ఞప్తి చేస్తున్నా.. నువ్వు వరల్డ్ కప్లో ఆడు: ఆండ్రి రస్సెల్
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమవుతోంది. దాదాపు 20 దేశాలు కప్ కోసం తలపడే టీ20 ప్రపంచ కప్ సందడి వచ్చే నెల నుంచి ఆరంభం కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ ముగిసిన తర్వాత విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) మొదలు కానుంది. ఇప్పటికే ప్రాథమికంగా జట్లను ప్రకటించినప్పటికీ.. ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఈ నెల 25 వరకు సమయం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్లో అదరగొట్టేస్తున్న విండీస్ ఆటగాడు సునీల్ నరైన్కు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఆండ్రి రస్సెల్ చివరిసారిగా ఓ విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న పొట్టి కప్లో ఆడితే బాగుంటుందని కోరాడు.
‘‘ఐపీఎల్లో నరైన్ ప్రదర్శన చూసిన తర్వాతే.. చాలా సంతోషించా. గౌతమ్ గంభీర్ వచ్చాక మాకు మరింత ఉత్సాహం వచ్చింది. నరైన్తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని పట్టుబట్టాడు. గత సీజన్లలో అతడిని 9 లేదా 10వ స్థానంలో ఆడించాం. అక్కడ అతడి అవసరం పెద్దగా లేదు. ఈసారి ఓపెనర్గా తనకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఓ బౌలర్ దాదాపు 500 పరుగులు చేయడం సాధారణ విషయం కాదు. ఇటు బౌలింగ్లోనూ 16 వికెట్లనూ పడగొట్టాడు. ఆల్రౌండ్ ప్రతిభతో కోల్కతా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ నిర్ణయం వల్లే అతడికి ప్రమోషన్ లభించింది.
ఈ స్థాయి ఫామ్లో ఉన్న నరైన్ను టీ20 ప్రపంచ కప్లోనూ చూడాలనేది నా కోరిక. గతంలో మా జట్టును ప్రకటించే సమయంలోనూ చాలా చెప్పి చూశా. దాదాపు రెండు వారాలపాటు అతడితో మాట్లాడుతూనే ఉన్నాం. ‘ప్లీజ్.. ఈ వరల్డ్ కప్లో ఆడు. ఆ తర్వాత నువ్వు రిటైర్ అయినా ఫర్వాలేదు. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు’ అని విజ్ఞప్తి చేశాం. అప్పటికే అతడు ఓ నిర్ణయం తీసేసుకున్నాడు. దానిని మనం గౌరవించాలి. ఒకవేళ ఏదైనా మార్చుకొని ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుంది’’ అని రస్సెల్ వ్యాఖ్యానించాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం) టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)