IPL-2023: గిల్, గైక్వాడ్లను చూసి.. ఆట తీరు మార్చుకో : పృథ్వీషా ప్రదర్శనపై సెహ్వాగ్
ఈ ఐపీఎల్(IPL 2023)లో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శనతో దిల్లీ ఓపెనర్ పృథ్వీషా(Prithvi Shaw) విమర్శలనెదుర్కొంటున్నాడు.
ఇంటర్నెట్డెస్క్ : ఐపీఎల్(IPL-2023)లో దిల్లీ(Delhi Capitals) మరోసారి నిరాశపర్చింది. గుజరాత్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ జట్టు టాప్ ఆర్డర్ విఫలమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో అంచనాలు ఉన్న పృథ్వీషా(Prithvi Shaw) పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీనిపై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్(Virender Sehwag) స్పందించాడు. శుభ్మన్ గిల్(Shubman Gill), రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad)తో పోల్చుతూ షా ప్రదర్శనపై విమర్శలు గుప్పించాడు.
అండర్-19 ప్రపంచకప్ తర్వాత పృథ్వీషా ప్రదర్శన తగ్గుతోందని.. అదే టోర్నీలో షా సహచర ఆటగాడైన గిల్ అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడని సెహ్వాగ్ ఓ ఛానల్తో మాట్లాడుతూ అన్నాడు. ‘ఒకే రకమైన షాట్లు ఆడి షా చాలా సార్లు ఔట్ అవుతున్నాడు. అయితే.. అతడు తప్పుల నుంచి నేర్చుకోవాలి కదా.. లేదు. శుభ్మన్ గిల్ను చూడండి. షాతో కలిసి అండర్ -19 క్రికెట్ ఆడాడు. ఇప్పుడు టెస్టు, వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్నాడు. కానీ.. షా ఇంకా ఐపీఎల్లోనే ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఈ ఐపీఎల్ను ఉపయోగించుకుని.. ఆటను మెరుగుపరుచుకోవాలి’ అని సెహ్వాగ్ అన్నాడు.
ఇక ఈ ఐపీఎల్లో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్న చెన్నై ఆటగాడు రుత్రాజ్ గైక్వాడ్తో కూడా షాను పోల్చాడు సెహ్వాగ్. ‘రుత్రాజ్ ఓ ఐపీఎల్ సీజన్లో 600కుపైగా పరుగులు చేశాడు. గిల్ కూడా భారీగా పరుగులు చేస్తున్నాడు’ అని షా తన ఆట తీరును పరిశీలన చేసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఇక లఖ్నవూతో ఆడిన తొలి మ్యాచ్లో షా 12 పరుగులు చేయగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగులు మాత్రమే చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.