Pakistan: పాకిస్థాన్ సెమీస్ చేరడానికి ఇంకా అవకాశాలు.. సమీకరణాలు ఇలా..
ప్రపంచకప్లో పాకిస్థాన్ (Pakistan) ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే, ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ (Pakistan) కచ్చితంగా సెమీ ఫైనల్స్కు వస్తుందని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పాక్ ఆటతీరుతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రెండు మ్యాచ్ల్లో (నెదర్లాండ్స్, శ్రీలంకపై) మాత్రమే విజయం సాధించి తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ రేసులో చాలా వెనుకబడి పోయింది. అయితే, పాక్ సెమీస్ చేరడానికి ఇంకా అవకాశాలున్నాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. మరి, పాక్ సెమీస్కు రావాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయో 10 పాయింట్లలో తెలుసుకుందాం.
- మొదటగా పాకిస్థాన్ మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అప్పుడే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
- పాక్.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ నుంచి పాక్కు గట్టి పోటీ ఉండటం ఖాయం.
- న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్లు ఆడి నాలుగేసి విజయాలతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
- పాక్ సెమీస్కు రావాలంటే కివీస్, ఆసీస్ మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోవాలి.
- ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ గెలిచినా.. పాక్కు అవకాశం ఉంటుంది.
- అప్పుడు పాకిస్థాన్ తన మిగిలిన మూడు మ్యాచ్ల్లో భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్ల కంటే ఎక్కువ నెట్రన్రేట్ కలిగి ఉండాలి.
- శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఇప్పటివరకు ఐదేసి మ్యాచ్లు ఆడి రెండింటిలో విజయం సాధించాయి.
- ఆ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్ల్లో ఓడితే పాక్ సునాయసంగా సెమీస్కు చేరుతుంది.
- ఒకవేళ అఫ్గాన్, శ్రీలంక మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో మూడింటిలో గెలిచినా.. పాక్కు ఛాన్స్ ఉంటుంది.
- అప్పుడు పాకిస్థాన్ మూడింటిలో భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్ల కంటే ఎక్కువ నెట్రన్రేట్ కలిగి ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!