Pakistan: పాకిస్థాన్‌ సెమీస్‌ చేరడానికి ఇంకా అవకాశాలు.. సమీకరణాలు ఇలా..

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan) ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే, ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలున్నాయి. 

Updated : 28 Oct 2023 22:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ (Pakistan) కచ్చితంగా సెమీ ఫైనల్స్‌కు వస్తుందని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, పాక్‌ ఆటతీరుతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో (నెదర్లాండ్స్‌, శ్రీలంకపై) మాత్రమే విజయం సాధించి తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్‌ రేసులో చాలా వెనుకబడి పోయింది. అయితే, పాక్‌ సెమీస్‌ చేరడానికి ఇంకా అవకాశాలున్నాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. మరి, పాక్‌ సెమీస్‌కు రావాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయో 10 పాయింట్లలో తెలుసుకుందాం. 

  1. మొదటగా పాకిస్థాన్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. అప్పుడే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.  
  2. పాక్‌.. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ నుంచి పాక్‌కు గట్టి పోటీ ఉండటం ఖాయం.  
  3. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.  
  4. పాక్‌ సెమీస్‌కు రావాలంటే కివీస్‌, ఆసీస్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి.
  5. ఒకవేళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఒక్కో మ్యాచ్‌ గెలిచినా.. పాక్‌కు అవకాశం ఉంటుంది. 
  6. అప్పుడు పాకిస్థాన్‌ తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్ల కంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్‌ కలిగి ఉండాలి. 
  7. శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఇప్పటివరకు ఐదేసి మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించాయి. 
  8. ఆ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఓడితే పాక్‌ సునాయసంగా సెమీస్‌కు చేరుతుంది. 
  9. ఒకవేళ అఫ్గాన్‌, శ్రీలంక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచినా.. పాక్‌కు ఛాన్స్ ఉంటుంది. 
  10. అప్పుడు పాకిస్థాన్‌ మూడింటిలో భారీ తేడాతో విజయం సాధించి ఆ జట్ల కంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్‌ కలిగి ఉండాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని