Afghanistan Cricket: మొదట ఇంగ్లాండ్... ఇప్పుడు పాక్... అఫ్గానిస్థాన్ కసి వెనుక కన్నీళ్లు!
డిఫెండింగ్ ఛాంపియన్, ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ (England)ను, మేటి జట్టుగా పేరుగాంచిన పాకిస్థాన్ను ఓడించి సంచలనం రేపింది అఫ్గానిస్థాన్ (Afghanistan).
డిఫెండింగ్ ఛాంపియన్, ఈ ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ (England)ను ఓడించి పెను సంచలనమే రేపింది అఫ్గానిస్థాన్ (Afghanistan). ఆ విజయం ప్రకంపనలు ఇంకా వినిపిస్తుండగానే మరో సంచలనం సృష్టించింది. ఈసారి అఫ్గాన్ వీరుల దెబ్బకు పాకిస్థాన్ కుదేలైంది. ఎంతో కసి ఉంటే కానీ... ఇలాంటి విజయాలు రావు. అయితే ఆ కసి వెనుక ఉన్న కన్నీళ్ల కథ తెలిస్తే ఇంతటి గుండె నిబ్బరం ఎలా అని అనిపించకమానదు.
అఫ్గానిస్థాన్ జట్టు ప్రపంచకప్లో ఒకటో రెండో విజయాలు సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు కానీ.. మరీ ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి జట్లను సులువుగా ఓడించేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కొన్నేళ్లుగా అఫ్గాన్ జట్టును అనుసరిస్తున్న వాళ్లకు, ఈ ప్రపంచకప్లో వారి ప్రదర్శన చూస్తే... ఇవేవో గాలివాటం విజయాల్లా కనిపించవు. అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు ఏ స్థితిలో ప్రపంచకప్లో అడుగు పెట్టారో తెలిస్తే.. వాళ్ల దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే వారు సాధించిన విజయాలు ఇంకా గొప్పగా అనిపించి, ఆ జట్టు మీద అభిమానం పెరుగుతుంది.
కొన్ని రోజుల క్రితం సంభవించిన భూకంపం అఫ్గానిస్థాన్ను కుదిపేసింది. ఈ ఉత్పాతం ధాటికి అక్కడ ఏకంగా 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసలే రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గానిస్థాన్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా ఆ దేశం చితికిపోయింది. అమెరికా సహా అన్ని దేశాల నుంచి అఫ్గాన్కు ఆర్థిక సాయం ఆగిపోయింది. దీనికి తోడు ఇప్పుడు భూకంపం తీవ్రంగా నష్టం కలిగించింది. అఫ్గాన్ తాలిబన్ల చేతికి వెళ్లాక ఆ దేశ క్రికెటర్లు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఎవరికి వారు అన్నట్లు ఉండే ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున ఏదైనా సిరీస్, టోర్నీ ఆడాల్సినపుడు మాత్రమే ఒక చోటికి చేరుతున్నారు. ఇలాంటి ఆటగాళ్లలో జట్టు భావన తీసుకురావడం చిన్న విషయం కాదు. కానీ ఎప్పుడు ఆడినా సమష్టిగానే సత్తా చాటుతారు అఫ్గాన్ ఆటగాళ్లు.
మిగతా సమయాల్లో వాళ్లందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో టీ20, టీ20 లీగ్స్ ఆడుతుంటారు. వాళ్ల కుటుంబాలు కూడా దుబాయ్ లాంటి చోట్ల స్థిరపడ్డాయి. కానీ బంధువులు, సన్నిహితులు మాత్రం అఫ్గానిస్థాన్లో ఉంటున్నారు. ఇప్పటికే దుర్భర స్థితిలో ఉన్న తమ దేశం భూకంపంతో నష్టపోతే అఫ్గాన్ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భూకంప బాధితుల్లో వారికి తెలిసిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ప్రపంచకప్లో అడుగు పెట్టింది. బాధను అణచుకుని దిల్లీలో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టును ఓడించింది. ఆ మ్యాచ్ అయ్యాక అఫ్గాన్ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. ఈ విజయాన్ని తమ దేశ భూకంప బాధితులకు అంకితమిచ్చారు. తమ దేశ ప్రజలు నవ్వడం మరిచిపోయారని.. ఈ విజయం వారి ముఖాల్లో కొంచెం చిరునవ్వును తీసుకొస్తుందని ఆశిస్తున్నామని రషీద్ ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
భారత్ అండతో..
గత దశాబ్ద కాలంలో అఫ్గానిస్థాన్ ప్రపంచ క్రికెట్లో ఎంత వేగంగా ఎదుగుతోందో తెలిసిందే. ఒక స్థాయి ఉన్న జట్లను ఓడించడం ఎప్పట్నుంచో అలవాటుగా మార్చుకుంది. అయితే మిగతా జట్లలా అఫ్గానిస్థాన్ ఆటగాళ్లకు తమ దేశంలో ఉత్తమ క్రికెట్ సౌకర్యాలేమీ లేవు. కొన్నేళ్ల ముందు వరకు ఆ దేశంలో క్రికెట్ స్టేడియమే లేదు. దశాబ్దాల క్రికెట్ సంస్కృతి లేకపోయినా.. గొప్ప సౌకర్యాలు లేకపోయినా.. సహజ ప్రతిభకు మెరుగులు దిద్దుకుని ఆ దేశ ఆటగాళ్లు ప్రపంచ స్థాయికి ఎదిగారు. టీ20 లీగ్స్ వారికి బాగా కలిసొచ్చాయి. నబి, రషీద్ ఖాన్, ముజీబ్ రెహ్మాన్, గుర్బాజ్, ఫారూఖీ, నవీనుల్ హక్ లాంటి ప్రతిభావంతులు ఆ దేశానికి ప్రపంచ క్రికెట్లో ఒక స్థాయిని తీసుకొచ్చారు.
ఎదుగుతున్న దశలో అఫ్గాన్కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశంలో స్టేడియం నిర్మించడమే కాక.. మరికొన్ని క్రికెట్ సౌకర్యాలు సమకూర్చింది. అఫ్గాన్ తమ సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్లు కొన్నింటికి భారత్నే వేదికగా మార్చింది. ఆ దేశ ఆటగాళ్లు ఇక్కడి క్రికెట్ సౌకర్యాలను ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించింది. అంతే కాక లాల్సింగ్ రాజ్పుత్, మనోజ్ ప్రభాకర్ గతంలో అఫ్గాన్కు కోచ్లుగా పని చేశారు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లోనూ అజయ్ జడేజా అఫ్గానిస్థాన్కు మెంటార్గా వ్యవహరిస్తుండటం విశేషం. ఇలా అఫ్గాన్ ఎదుగుదలలో భారత్ పాత్ర ఎంతో కీలకం.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81