KL Rahul - Shreyas: ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోతే.. వరల్డ్ కప్లోనూ కష్టమే!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆసియా కప్తోపాటు వన్డే ప్రపంచకప్ (ODi World Cup 2023) బరిలోకి దిగే జట్ల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే, ఇద్దరు కీలక ఆటగాళ్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ వారంలో వారి ఫిట్నెస్పై ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
స్వదేశంలో మెగా టోర్నీ.. పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంత చేసుకోవాలనే పట్టుదల.. ఇదంతా నాణేనికి ఒక వైపు.
ఓపెనర్లు ఎవరు? మిడిలార్డర్లో కాచుకొనే ఆటగాళ్లు ఎవరు? మరీ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే బ్యాటర్ ఎవరు? గాయాల నుంచి కోలుకొనేదెవరు? ఇదీ నాణేనికి మరోవైపు టీమ్ఇండియా పరిస్థితి.
ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు.. స్పందించిన విరాట్ కోహ్లీ
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురిపైనే ఇప్పుడందరి దృష్టి.. వారు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఇందులో బుమ్రాను ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్గా ఎంపిక చేశారు. అక్కడ ఫామ్లోకి వస్తే భారత్ పేస్ బౌలింగ్ బలంగా మారనుంది. కానీ, కేఎల్ రాహుల్తోపాటు శ్రేయస్ అయ్యర్ గాయాల పరిస్థితిపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఈ వారంలోనే ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్ 18వ తేదీన గాయపడిన వారికి ఫిట్నెస్ టెస్టు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో పాసైతేనే ఆసియా కప్ కోసం ప్రకటించే జట్టులో స్థానం దక్కనుంది. ఒకవేళ విఫలమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే మాత్రం వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రానున్న రెండు రోజుల్లో...?
ఆసియా కప్ స్క్వాడ్కు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ వచ్చే రెండు రోజుల్లో మిగతా సెలెక్టర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. విండీస్ నుంచి భారత జట్టు మిగతా రెండు టీ20ల కోసం అమెరికా వెళ్లగా.. అజిత్ అగార్కర్ మాత్రం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఐర్లాండ్తో భారత్ మూడు టీ20ల సిరీస్ను ఆగస్ట్ 18 నుంచి ఆడనుంది. బుమ్రాతోపాటు యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఫామ్ను నిరూపించుకుంటే వారిద్దరు ఆసియా కప్లో ఆడటం ఖరారు కానుంది. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ పరిస్థితిపై అంచనాకు రావాలంటే ఎన్సీఏలో ఉంటూనే ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడి ఆగస్ట్ 18న జరగనున్న ఫిట్నెస్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు.. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకుని రావడంతో సందిగ్ధత నెలకొంది. పూర్తిగా కోలుకున్నట్లుగా అనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి అయితే, అయ్యర్ వస్తే మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగడం వల్ల జట్టుకు నిలకడ వస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
వీరిద్దరు లేకపోతే.. నాలుగో స్థానం ఎవరిది?
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్తోపాటు ఫామ్ అందిపుచ్చుకుంటే భారత్కు ‘నంబర్ 4’ కష్టాలు తీరతాయి. ఒకవేళ వారిద్దరు లేకపోతే మాత్రం ఎలా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. కెప్టెన్ రోహిత్ శర్మ ‘యువీ తర్వాత నాలుగో స్థానంలో స్థిరంగా ఎవరూ రాణించలేకపోయారు’ అని చెప్పిన సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడాడు. మంచి ఇన్నింగ్స్లు అందించాడు. ఒకవేళ అతడు లేకపోతే మాత్రం ఆ స్థానంలో సంజూ శాంసన్ లేదా సూర్యకుమార్తోపాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ రేసులో నిలిచారు. ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ అతడు ఎక్కువగా ఓపెనర్గానే రాణించాడు. నాలుగో స్థానంలో ఉత్తమ గణాంకాలు లేవు. కాబట్టి, ఇలాంటి తలనొప్పుల నుంచి భారత్కు విముక్తి లభించాలంటే శ్రేయస్, కేఎల్ తమ ఫిట్నెస్ను నిరూపించుకొని ఫామ్లోకి రావాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్