KL Rahul - Shreyas: ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోతే.. వరల్డ్ కప్లోనూ కష్టమే!
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆసియా కప్తోపాటు వన్డే ప్రపంచకప్ (ODi World Cup 2023) బరిలోకి దిగే జట్ల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే, ఇద్దరు కీలక ఆటగాళ్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఈ వారంలో వారి ఫిట్నెస్పై ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
స్వదేశంలో మెగా టోర్నీ.. పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంత చేసుకోవాలనే పట్టుదల.. ఇదంతా నాణేనికి ఒక వైపు.
ఓపెనర్లు ఎవరు? మిడిలార్డర్లో కాచుకొనే ఆటగాళ్లు ఎవరు? మరీ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే బ్యాటర్ ఎవరు? గాయాల నుంచి కోలుకొనేదెవరు? ఇదీ నాణేనికి మరోవైపు టీమ్ఇండియా పరిస్థితి.
ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు.. స్పందించిన విరాట్ కోహ్లీ
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురిపైనే ఇప్పుడందరి దృష్టి.. వారు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఇందులో బుమ్రాను ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్గా ఎంపిక చేశారు. అక్కడ ఫామ్లోకి వస్తే భారత్ పేస్ బౌలింగ్ బలంగా మారనుంది. కానీ, కేఎల్ రాహుల్తోపాటు శ్రేయస్ అయ్యర్ గాయాల పరిస్థితిపై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. ఈ వారంలోనే ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్ 18వ తేదీన గాయపడిన వారికి ఫిట్నెస్ టెస్టు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో పాసైతేనే ఆసియా కప్ కోసం ప్రకటించే జట్టులో స్థానం దక్కనుంది. ఒకవేళ విఫలమై విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే మాత్రం వరల్డ్ కప్ ఆడటం కూడా అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రానున్న రెండు రోజుల్లో...?
ఆసియా కప్ స్క్వాడ్కు సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ వచ్చే రెండు రోజుల్లో మిగతా సెలెక్టర్లతో చర్చలు జరిపే అవకాశం ఉంది. విండీస్ నుంచి భారత జట్టు మిగతా రెండు టీ20ల కోసం అమెరికా వెళ్లగా.. అజిత్ అగార్కర్ మాత్రం స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఐర్లాండ్తో భారత్ మూడు టీ20ల సిరీస్ను ఆగస్ట్ 18 నుంచి ఆడనుంది. బుమ్రాతోపాటు యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఫామ్ను నిరూపించుకుంటే వారిద్దరు ఆసియా కప్లో ఆడటం ఖరారు కానుంది. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ పరిస్థితిపై అంచనాకు రావాలంటే ఎన్సీఏలో ఉంటూనే ప్రాక్టీస్ మ్యాచ్లను ఆడి ఆగస్ట్ 18న జరగనున్న ఫిట్నెస్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు.. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకుని రావడంతో సందిగ్ధత నెలకొంది. పూర్తిగా కోలుకున్నట్లుగా అనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి అయితే, అయ్యర్ వస్తే మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగడం వల్ల జట్టుకు నిలకడ వస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
వీరిద్దరు లేకపోతే.. నాలుగో స్థానం ఎవరిది?
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్తోపాటు ఫామ్ అందిపుచ్చుకుంటే భారత్కు ‘నంబర్ 4’ కష్టాలు తీరతాయి. ఒకవేళ వారిద్దరు లేకపోతే మాత్రం ఎలా? అనే ప్రశ్న తలెత్తడం సహజం. కెప్టెన్ రోహిత్ శర్మ ‘యువీ తర్వాత నాలుగో స్థానంలో స్థిరంగా ఎవరూ రాణించలేకపోయారు’ అని చెప్పిన సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడాడు. మంచి ఇన్నింగ్స్లు అందించాడు. ఒకవేళ అతడు లేకపోతే మాత్రం ఆ స్థానంలో సంజూ శాంసన్ లేదా సూర్యకుమార్తోపాటు యువ బ్యాటర్ తిలక్ వర్మ రేసులో నిలిచారు. ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ అతడు ఎక్కువగా ఓపెనర్గానే రాణించాడు. నాలుగో స్థానంలో ఉత్తమ గణాంకాలు లేవు. కాబట్టి, ఇలాంటి తలనొప్పుల నుంచి భారత్కు విముక్తి లభించాలంటే శ్రేయస్, కేఎల్ తమ ఫిట్నెస్ను నిరూపించుకొని ఫామ్లోకి రావాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్