Asia Cup 2023: మా ఆందోళనంతా పాండ్య ఫామ్పైనే.. కేఎల్ కోసం వెంకటేశ్ ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు!
ఆసియా కప్ (Asia Cup 2023) కోసం ఎంపికైన సీనియర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాండ్య ఫామ్పైనా, కేఎల్ రాణించాలని మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) కోసం ప్రకటించిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) డిప్యూటీగా హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. విండీస్తో ఐదు టీ20ల సిరీస్లో అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చినా బీసీసీఐ మద్దతుగా నిలిచింది. బౌలింగ్లో కాస్త ఫర్వాలేదనింపించాడు. బ్యాటింగ్లో మాత్రం మునుపటి ఫామ్ను కొనసాగించకలేకపోయాడు. మినీ, మెగా టోర్నీల్లో పాండ్య (Hardik Pandya) కీలకమవుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత (Team India) మాజీ ఆటగాడు మదన్ లాల్ మాత్రం హార్దిక్ ఫామ్ ఆందోళనకు గురి చేసేలా ఉందని వ్యాఖ్యానించాడు.
రెండింట్లో విఫలమైనా తిలక్ రెడీనే.. మహిళలకూ సమాన పారితోషికం.. బాబర్ చెత్త రికార్డు
‘‘హార్దిక్ పాండ్య (Hardik Pandya) తప్పకుండా తర్వాతి కెప్టెన్ అవతాడనంలో అనుమానం లేదు. ఇప్పటికే అతడు టీ20ల్లో జట్టును నడిపిస్తున్నాడు. అయితే.. కెప్టెన్సీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అతడి ఫామ్ ఆందోళనకరంగా ఉంది. అద్భుతమైన ఆటగాడు. అయితే, గతంలో ఆసీస్పై చేసిన 92 పరుగుల ఇన్నింగ్స్ మళ్లీ చూడలేకపోయాం. అలాంటి ఫామ్లోకి హార్దిక్ పాండ్య రావాలి. ఆసియా కప్, వరల్డ్ కప్లో బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషిస్తాడు. అతడు బౌలింగ్ చేసిన తీరుపట్ల సంతోషంగా ఉంది. ఆరో బౌలర్గా పాండ్య అక్కరకొస్తాడు. బీసీసీఐ కూడా అతడికి ఇలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించింది’’ అని తెలిపాడు.
అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రార్థనలు
కొంతకాలం కిందట భారత ఆటగాడు కేఎల్ రాహుల్ను జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. తాజాగా ఆసియా కప్ కోసం ఎంపికైన రాహుల్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాడట. సినీ నటుడు సునీల్ శెట్టితో కలిసి న్యూ జెర్సీలోని స్వామి నారాయణ ఆలయానికి వెంకటేశ్ ప్రసాద్ వెళ్లాడు. దీనిపై ట్విటర్ వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. ‘‘న్యూజెర్సీలోని స్వామి నారాయణ్ ఆలయాన్ని అన్న (సునీల్ శెట్టి)తో కలిసి సందర్శించా. భారతీయులంతా బాగుండాలని.. వరల్డ్ కప్లో టీమ్ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ప్రార్థించాం. అలాగే కేఎల్ రాహుల్ కూడా మెగా టోర్నీల్లో రాణించాలని ప్రార్థనలు చేశా. నా లాంటి విమర్శకుల నోళ్లు మూయించేలా ఆడాలి. అందరూ సంతోషంగా ఉండండి’’ అంటూ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?