NZ vs AUS: ఆసీస్ చేతిలో కివీస్ ఘోర ఓటమి.. అగ్రస్థానానికి చేరిన భారత్
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక అప్డేట్ అయింది. భారత్ మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. దానికి కారణం న్యూజిలాండ్ ఓడిపోవడమే..
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ (NZ vs AUS) ఓడిపోవడం భారత్కు కలిసొచ్చింది. అదేంటి ఆ జట్టు ఓడిపోతే మనకు కలిగిన లాభమేంటనేగా? మీ సందేహం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లోగా టాప్ -2 జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన టీమ్ఇండియా హ్యాట్రిక్పై కన్నేసింది. అయితే, న్యూజిలాండ్ నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్ కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు ఆసీస్ చేతిలో పరాజయం పాలైన కివీస్ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టీమ్ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్లో నిలవగా.. న్యూజిలాండ్ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఇంగ్లాండ్తో భారత్ మార్చి 7 నుంచి చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా అందులోనూ గెలిస్తే పర్సంటేజీ మరింత మెరుగై అగ్రస్థానం నిలబడుతుంది. ఓడితే మళ్లీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మార్చి 8 నుంచి ఆసీస్-కివీస్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత నుంచి దాదాపు మూడు నెలలపాటు టెస్టులను ఈ నాలుగు జట్లూ ఆడవు.
తేలిపోయిన కివీస్..
కొండంత లక్ష్యం. ఓవర్ నైట్ స్కోరు 111/3 స్కోరుతో పోరాడుతున్నట్లే కనిపించిన కివీస్. కానీ, నాలుగో రోజు ఆటలో నాథన్ లైయన్ (6/65) దెబ్బకు కుదేలైంది. ఓవర్నైట్ స్కోరుకు మరో 85 పరుగులను మాత్రమే జోడించి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ నిర్దేశించిన 369 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 196 పరుగులకే ఆలౌటైంది. దీంతో 172 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. రచిన్ రవీంద్ర (59) నిన్నటి స్కోరుకు మరో మూడు పరుగులు మాత్రమే జోడించాడు. డారిల్ మిచెల్ (38), స్కాట్ కుగ్గెలిజిన్ (26) కాసేపు పోరాడారు. తొలి ఇన్నింగ్స్లో కంగారూల జట్టు 383 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 179 రన్స్కే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో 164 పరుగులకే ఆసీస్ ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!