WPL 2024: అట్టహాసంగా మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం.. టాస్ నెగ్గిన ముంబయి
రెండో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ఘనంగా మొదలైంది. బాలీవుడ్ తారలు మైదానంలో చేసిన సందడి ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్లో తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్టులు ముంబయి ఇండియన్స్ - దిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) జట్ల మధ్య మొదలైంది. టాస్ నెగ్గిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మరీ చిన్నది కావడం విశేషం. లెగ్సైడ్ 50 మీటర్లు, ఆఫ్ సైడ్ కేవలం 60 మీటర్లు మాత్రమే ఉంటుంది. బెంగళూరు పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం. ఇప్పుడు చిన్న బౌండరీలు కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉన్నారు. ముంబయికి కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, దిల్లీ జట్టుకు సారథిగా మెగ్ లానింగ్ వ్యవహరిస్తోంది.
తుది జట్లు:
ముంబయి ఇండియన్స్: హీలే మాథ్యూస్, నాట్ స్కివెర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), అమేలియా కెర్, అమన్జోత్ కౌర్, సజనా, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్
దిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఎలిస్ కాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్నె కాప్, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మని, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, షికా పాండే
అట్టహాసంగా ప్రారంభ వేడుకలు..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో ఎడిషన్ ప్రారంభమైంది. సినీ తారలు షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తింది. బాలీవుడ్ పాటలకు చేసిన డ్యాన్స్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నటి అర్చనా విజయ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు మిగతా జట్ల సారథులను షారుఖ్ ఖాన్ పరిచయం చేశాడు. వీరిని ప్రత్యేక వాహనంలో మైదానంలో తిప్పడం విశేషం. అనంతరం స్టేజ్పై ఐదుగురు సారథులతో కలిసి షారుఖ్ స్టెప్పులు వేశాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..