Wrestlers: దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు.
బిష్కెక్: పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics)కు అర్హత సాధించేందుకు చమటోడుస్తోన్న ప్రముఖ రెజ్లర్లు దీపక్ పునియా (Deepak Punia), సుజీత్ కలాకల్ (Sujeet Kalakal)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కిర్గిస్థాన్లోని బిష్కెక్లో ప్రారంభమైన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ (Asia Olympic Qualifiers)కు వీరిద్దరూ దూరమయ్యారు. భారీ వర్షాల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న వీరు సరైన సమయానికి వేదిక వద్దకు చేరుకోలేదు. దీంతో పోటీలకు వారిని అనుమతించలేదు.
దీపక్, సుజీత్ ఇటీవల రష్యాలో శిక్షణ తీసుకున్నారు. అది ముగించుకుని దుబాయ్ మీదుగా బిష్కెక్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 16న రష్యా నుంచి అక్కడకు చేరుకున్నారు. అయితే, ఇటీవల అక్కడ కురిసిన భారీ వర్షాలతో దుబాయ్ ఎయిర్పోర్టులో నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గత మంగళవారం నుంచి వీరు ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు. చివరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విమానం దొరకడంతో శుక్రవారం తెల్లవారుజామున కిర్గిస్థాన్ చేరుకున్నారు.
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
అయితే, విమానం ఆలస్యం కారణంగా వీరిద్దరూ షెడ్యూల్ సయమానికి క్వాలిఫయర్స్ వేదిక వద్దకు చేరుకోలేదు. నిబంధనల ప్రకారం ముందు బరువు పరీక్షించిన తర్వాత పోటీలు నిర్వహిస్తారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బరువు పరీక్షలు నిర్వహించారు. ఆ సమయానికి వీరు అక్కడకు వెళ్లలేకపోయారు. దీపక్, సుజీత్ పరిస్థితిని మన దేశ కోచ్లు, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్.. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ప్రతినిధులకు వివరించారు. అదనపు సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకోసం నిర్వాహకులు డెడ్లైన్ తర్వాత 10 నిమిషాలు ఎదురుచూసినా రాకపోవడంతో ఈ రెజ్లర్లను పోటీలకు అనుమతించలేదు. దీంతో ఈ క్వాలిఫయర్స్కు వారు దూరమయ్యారు.
ఇక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు వీరికి ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. ఈ ఏడాది మేలో తుర్కియేలో జరిగే ప్రపంచ క్వాలిఫయర్స్లో వీరు పాల్గొని కోటా సాధించాలి. దీపక్ పునియా టోక్యో ఒలింపిక్స్లో 86 కేజీల విభాగంలో పతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈసారి పారిస్లోనైనా పతకం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు