Yash Dayal: అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గతేడాది ఐపీఎల్ సీజన్లో కోల్కతా బ్యాటర్ రింకు సింగ్ బీభత్సానికి ఓ బౌలర్ బలైన సంగతి అందరికీ గుర్తుంది కదా.. అతడే యశ్ దయాళ్. ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు ఇవ్వడంతో కొన్నాళ్లు మానసికంగా కుంగిపోయాడు. గత మినీ వేలం సందర్భంగా అతడిని ఎవరూ తీసుకోరని అంతా భావించారు. కానీ, బెంగళూరు ముందుకొచ్చి మంచి ధరనే వెచ్చించి కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 13 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా ప్లేఆఫ్స్కు కీలకమైన చెన్నైతో మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ను కట్టుదిట్టంగా వేసి డేంజరస్ బ్యాటర్ ధోనీని ఔట్ చేసి హీరోగా మారిపోయాడు. ఈ మ్యాచ్ అనంతరం సిరాజ్తో యశ్ మాట్లాడుతూ.. చివరి ఓవర్ వేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదని తెలిపాడు.
‘‘నేను చివరి ఓవర్ వేయడం ఎప్పటికీ మరిచిపోలేను. మేం ప్లేఆఫ్స్కు చేరాలంటే అత్యంత కీలకమైన ఓవర్. తొలి బంతికే ధోనీ సిక్స్ కొట్టేశాడు. ఆ తర్వాత బాల్కే అతడిని ఔట్ చేయగలిగా. ఇదే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు.. ఆ చివరి ఓవర్ మరొకెత్తు. ఆ సమయంలో నా మదిలో ఒకే ఒక్క ఆలోచన మెదిలింది. సరైన లెంగ్త్ డెలివరీని మాత్రమే సంధించాలని అనుకున్నా. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు వైపు చూడలేదు. మంచిగా బౌలింగ్ చేయడంపైనే దృష్టిపెట్టా. విరాట్ కోహ్లీ ఇచ్చిన సూచనలూ అక్కరకొచ్చాయి. స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ ఆత్మవిశ్వాసమే నన్ను చివరి ఓవర్లో ముందుకు నడిపించింది’’ అని యశ్ తెలిపాడు.
మేనేజ్మెంట్ మద్దతుతో..
గతేడాది గుజరాత్కు ప్రాతినిధ్యం వహించిన యశ్.. రింకు దెబ్బకు ఒక్కసారిగా కుదేలయ్యాడు. ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇచ్చిన మద్దతుతో రాణిస్తున్నానని వెల్లడించాడు. ‘‘ఆర్సీబీ జట్టులోకి రావడం చాలా ఉపయోగకరంగా మారింది. టీమ్కు నేనెంత కీలక ప్లేయర్గా చెబుతూ ఎప్పటికప్పుడు సపోర్ట్గా నిలిచింది. ఇప్పుడు ఆ ఫలితాలను సాధించడం మరింత ఆనందంగా ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ మా కుర్రాళ్లకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. అతడూ గొప్ప అథ్లెట్. ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ అందిస్తాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. వీరిద్దరి వల్ల యువ క్రికెటర్లు ఎవరూ ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు’’ అని ఆర్సీబీ బౌలర్ పేర్కొన్నాడు.
రింకు స్పెషల్ పోస్టు..
రింకు సింగ్ తనకు స్నేహితుడి కంటే ఎక్కువని.. ఒక సోదరుడిలాంటివాడని గతంలోనే యశ్ వ్యాఖ్యానించాడు. తాజాగా చెన్నైపై ఉత్తమ ప్రదర్శన చేయడంతో యశ్ను అభినందిస్తూ.. ‘ఇదంతా దేవుడి ప్లాన్ బేబీ’ అంటూ రింకు పోస్టు చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్