Yashasvi Jaiswal: అవేవీ పట్టించుకోను.. మైదానంలో ఏం చేయాలనుకుంటే అదే చేస్తా: యశస్వి
దూకుడుగా ఆడటం తామే నేర్పినట్లు వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ డకెట్పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, భారత యువ క్రికెటర్ మాత్రం వాటిపై స్పందించిన తీరు అద్భుతం.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఇంగ్లిష్ జట్టు పాటించే బజ్బాల్ క్రికెట్తో ఆటాడుకున్న యశస్వి బ్యాటింగ్పై బెన్ డకెట్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. తమ జట్టు వల్లే భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడటం నేర్చుకున్నారని.. అందుకు సగం క్రెడిట్ తమకు ఇవ్వాలని డకెట్ వ్యాఖ్యానించాడు. దీనిపై భారత, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కొందరు విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే అంశంపై యశస్వి జైస్వాల్ స్పందించాడు.
‘‘అలాంటి కామెంట్లపై నేనేమీ మాట్లాడను. వాటిని పట్టించుకోను. మైదానంలోకి దిగితే నా వంతు భాగస్వామ్యం అందించేందుకు ప్రయత్నిస్తా. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంపైనే దృష్టిపెడతా. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుంటారు. మాతో నడుస్తూ సమస్యలు ఏంటనేది ద్రవిడ్ తెలుసుకుంటాడు. ఆత్మవిశ్వాసం నింపుతూ అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీసుకువస్తాడు. ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తాడు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాను’’ అని జైస్వాల్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో యశస్వి 712 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
డకెట్పై నాజర్ హుస్సేన్ అసహనం
తమ వల్లే భారత బ్యాటింగ్ ఆర్డర్ దూకుడుగా ఆడుతుందనే డకెట్ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తప్పుబట్టాడు. ‘‘యశస్వి జైస్వాల్ సహా ఇతర భారత బ్యాటర్లు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే ఎదిగాడు. కష్టపడిన తీరు అద్భుతం. ఆత్మవిశ్వాసంతో యశస్వి ఆడాడు. బజ్బాల్ అంటూ దూకుడుగా ఆడటంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమైన సమయంలో భారత్ మాత్రం అద్భుతంగా పరుగులు రాబట్టింది’’ అని హుస్సేన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక