Yashasvi Jaiswal: యశస్వికి మీరు నేర్పలేదు..: డకెట్కు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చురక
Yashasvi Jaiswal: టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను చూసి నేర్చుకోవాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బజ్బాల్ అంటూ దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచిన ఇంగ్లాండ్కు మన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవల చుక్కలు చూపించాడు. రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టు (IND vs ENG Test Match)లో అదే బజ్బాల్ (Bazball) ఆటతో డబుల్ సెంచరీ కొట్టి ప్రత్యర్థిని వణికించాడు. అయితే యశస్వి ఆటకు క్రెడిట్ తమదేనంటూ ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ డకెట్ (Ben Duckett) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ (Nasser Hussain) ఘాటుగా స్పందించాడు. అతడు మిమ్మల్ని చూసి నేర్చుకోలేదంటూ ఇంగ్లీష్ జట్టుకు చురకలంటించాడు. అసలేం జరిగిందంటే..
మూడో టెస్టు మధ్యలో యశస్వి శతకం పూర్తయిన తర్వాత డకెట్ దానిపై మాట్లాడుతూ.. ‘‘ఇతర జట్ల కంటే భిన్నంగా మా ప్రత్యర్థులు టెస్టు క్రికెట్ ఆడుతుంటే.. అప్పుడు వారి ఆటలో కొంత క్రెడిట్ మేం తీసుకోవాల్సిందేనని అనిపిస్తుంది. మాలాగే ఇతర జట్ల ఆటగాళ్లు కూడా దూకుడైన క్రికెట్ ఆడటం ఉత్సాహం కలిగిస్తోంది’’ అని అన్నాడు.
పరుగుల తపస్వి.. యశస్వి జైస్వాల్!
ఈ వ్యాఖ్యలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ హుస్సేన్ స్పందిస్తూ డకెట్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ‘‘యశస్విపై డకెట్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. అతడు ఇంగ్లాండ్ నుంచే నేర్చుకున్నాడనే అర్థం వస్తోంది. అతడికి మీరేం నేర్పలేదు. జీవితంలో ఎదురైన సవాళ్లు, కష్టనష్టాల నుంచి, ఐపీఎల్ నుంచే యశస్వి ఎంతో నేర్చుకున్నాడు. కాబట్టి మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని అనుకుంటున్నా. ఈ బజ్బాల్ యుగంలో ఇంగ్లాండ్ మరింత మెరుగుపడాలంటే విమర్శలకు దూరంగా ఉండాలి. వీలైతే అతడి నుంచి మీరు ఏమైనా నేర్చుకోండి’’ అని సొంత జట్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం