Yashasvi Jaiswal: బాంద్రాలో ఇంటిని కొనుగోలు చేసిన యశస్వి జైస్వాల్.. ధర ఎంతంటే?
భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. అంటే అతడు వివాహ బంధంలోకి అడుగు పెట్టలేదు. ఓ ఫ్లాట్ను బుక్ చేసినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇప్పుడు ఏం చేసినా వైరల్ అయిపోతున్నాడు. ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన అతడు.. ఐసీసీ ర్యాంకుల్లోనూ జోరు చూపించాడు. టాప్ -20లోకి వచ్చేశాడు. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. అతడు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదీనూ అత్యంత ఖరీదైన ముంబయి మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఓ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం.. ఈస్ట్ బాంద్రాలో వింగ్ 3 ఏరియాలోని 1100 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ ధర దాదాపు రూ. 5.4 కోట్లు ఉంటుంది.
క్రికెటర్గా మారే క్రమంలో 22 ఏళ్ల యశస్వి చాలా కష్టాలను అనుభవించాడు. కొన్నాళ్లు టెంట్లోనూ జీవితం గడిపాడు. తర్వాత అతడి కోసం కుటుంబం యూపీ నుంచి ముంబయికి మారిపోయింది. క్రికెట్ శిక్షణ కోసం వెళ్లే సమయంలో పానీ పూరి బండి వద్ద పని చేసినట్లూ వార్తలు వచ్చాయి. జూనియర్ లెవల్లో తన సత్తా చూపించిన తర్వాత.. జైస్వాల్ వెనక్కి తిరిగి చూడలేదు. అండర్ -19 వరల్డ్ కప్ 2019లో రాణించాడు. దీంతో ఐపీఎల్లోకి అడుగు పెట్టే అవకాశం వచ్చింది. తొలిసారే రూ. 2.4 కోట్ల బిడ్ దక్కించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 2023 సీజన్లో 14 మ్యాచుల్లోనే 625 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లోనూ అతడే టాప్ స్కోరర్. కేవలం మూడు టెస్టుల్లోనే 545 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం