Pakistan: దేశం ఆర్థిక కష్టాల్లో ఉంటే.. కరెన్సీతో ‘పాక్ క్రికెటర్’ ఆటలు!
ఓ పాకిస్థాన్ యువ క్రికెటర్..తన చేతిలో ఉన్న డాలర్లతో నుదుటిమీద చెమటను తుడుచుకోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్.. సాయం కోసం అంతర్జాతీయ సంస్థల వైపు చూస్తోంది. అవి అందించే ఆర్థిక ప్యాకేజీలతో ప్రస్తుత కాలాన్ని వెల్లదీస్తోంది. ఇటువంటి సమయంలో ఓ పాకిస్థాన్ యువ క్రికెటర్ ప్రవర్తన ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. చేతిలో ఉన్న డాలర్లతో నుదుటి మీద చెమటను తుడుచుకోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. ప్రపంచ దేశాలు తిరిగే వీళ్లకు కనీస విలువలు తెలియవంటూ నెటిజన్లు మండిపడ్డారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో యువ ఆటగాడు ఆజం ఖాన్ (Azam Khan).. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇటీవల జాతీయజట్టు ప్లేయర్లతో సరదాగా సంభాషిస్తున్న క్రమంలో పక్కనే ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. ఏమైంది? అని ఆజంఖాన్ను అడిగాడు. తన చేతిలో ఉన్న డాలర్లతో ముఖంపై చెమటను తుడుచుకున్న ఆజమ్ఖాన్.. ఇక్కడ చాలా వేడిగా ఉందంటూ బదులిచ్చాడు. దాంతో అక్కడున్న తోటి క్రీడాకారులందరూ నవ్వడం ఆ వీడియోలో కనిపించింది.
ప్రపంచం మొత్తం పర్యటించినా..
ఇది కాస్త నెట్టింట చక్కర్లు కొట్టడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘పాక్ క్రీడా చరిత్రలో కొందరు మినహా ఎవరికీ అంత ప్రజాదరణ లేదు. అటువంటిది ఈ యువ క్రీడాకారుడి నుంచి ఏం ఆశిస్తాం?. ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉంది’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ‘అందుకే కనీస విద్య అవసరమని చెబుతుంటాం. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుంటారు.. కానీ, కనీస విలువలు తెలియవు. అంతర్జాతీయ క్రీడలకు పంపేముందు వాళ్లను మొదట స్కూలుకు పంపాలి’ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ‘పాకిస్థానీలు ఆహారకొరత ఎదుర్కొంటుంటే.. ఆజమ్ మాత్రం సేదదీరుతూ పేద ప్రజలను వెక్కిరిస్తున్నాడంటూ’ మరో యూజర్ మండిపడ్డాడు.
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. క్రీడాకారుల వీడియోలు అధికారిక డిజిటల్ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నందున అనవసర వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని సూచించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం