T20 World Cup - Yuvraj Singh: క్రికెట్ VS బేస్బాల్.. రెండింటి మధ్య తేడా అదేనని చెప్పా: యువరాజ్
తొలిసారి అమెరికా వేదికగా టీ20 ప్రపంచ కప్ సంగ్రామం జరగనున్న నేపథ్యంలో యువీ కీలక వ్యాఖ్యలు చేశాడు. యూఎస్ఏతోపాటు విండీస్ కూడా ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం ఐసీసీ నియమించిన రాయబారుల్లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఉన్నాడు. జూన్ 2 (భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు) పొట్టి కప్ యూఎస్ఏ - విండీస్ సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ యూఎస్ఏ - కెనడా (USA vs CAN) జట్ల మధ్య జరగనుంది. తొలిసారి మెగా టోర్నీకి అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై యువరాజ్ ఓ అమెరికన్ టీవీ షోలో స్పందించాడు. అక్కడ ప్రజాదరణ కలిగిన బేస్బాల్కు, క్రికెట్కు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఓ అమెరికన్ స్నేహితుడికి చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.
‘‘అమెరికాలో ఇలా క్రికెట్ ఆడతారని అస్సలు ఊహించలేదు. చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంది. ఐసీసీ ఇక్కడ కొత్తగా రెండు స్టేడియాలను నిర్మించింది. అమెరికన్లు క్రికెట్ చూడాలనుకోవడం నాకు నచ్చింది. ఇక్కడ ఎక్కువగా బేస్బాల్ను ఇష్టపడతారు. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అమెరికన్ ఫ్రెండ్ కలిసిన ప్రతిసారీ అతడు ఒకటే ప్రశ్న అడిగేవాడు. ‘క్రికెట్ అంటే ఏంటి?’ అని. ఇది కూడా బేస్బాల్లా ఉంటుందని చెప్పా. అయితే, మీరు అక్కడ రన్ కోసం నాలుగువైపులా పరుగెడతారు. క్రికెట్లో మాత్రం కేవలం ముందుకు - వెనక్కి మాత్రమే రన్ చేస్తాం. స్టేడియం బయటకు కొడితే బేస్బాల్లో ‘హోమ్ రన్’ అని పిలుస్తారు. క్రికెట్లో అయితే సిక్స్ అని అంటాం’’ అని యువీ తెలిపాడు.
ఇవాళ భారత్ - బంగ్లా వార్మప్ మ్యాచ్
ప్రపంచ కప్ సంగ్రామంలోకి అడుగుపెట్టే ముందు.. బంగ్లాదేశ్తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లు, డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది. కేవలం రెండు వార్మప్ మ్యాచులను మాత్రమే ఐసీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. విండీస్ - ఆస్ట్రేలియా మ్యాచ్ను కూడా ఇప్పటికే లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఆ మ్యాచ్లో వెస్టిండీస్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్