Chahal: వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఒక్క బిడ్ కూడా వేయలేదు: చాహల్
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) టీ20 క్రికెట్లో అద్భుత ఆటతీరున ప్రదర్శిస్తున్నాడు. అయితే, రెండేళ్ల కిందట ఆర్సీబీ తరఫున ఆడిన చాహల్ను ఆ జట్టు రిటెయిన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. అక్కడ రాజస్థాన్ కొనుగోలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL) సీజన్ ముగిసిన తర్వాత యుజ్వేంద్ర చాహల్ను (Chahal) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమతో అట్టిపెట్టుకోలేదు. ఆ సమయంలో ఆర్సీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు బెంగళూరు తరఫున ఆడిన చాహల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయినా, అతడిని రిటెయిన్ చేసుకోలేదు. కనీసం అతడిని పక్కన పెట్టడానికి కారణమేంటో కూడా చాహల్కు చెప్పకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై చాహల్ స్పందించాడు.
‘‘2014లో బెంగళూరు జట్టుతో నా ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ నా మీద నమ్మకంతో ఉన్నాడు. అయితే, నన్ను రిటెయిన్ చేసుకోకపోవడం తీవ్రంగా బాధించింది. ఎనిమిదేళ్లపాటు ఫ్రాంచైజీ కోసం ఆడాను. కనీసం కారణం కూడా చెప్పకపోవడం ఆవేదనకు గురి చేసింది. కొంతమంది నేనే ఎక్కువగా డబ్బు అడిగినట్లు మాట్లాడుకోవడం నా దృష్టికి వచ్చింది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో దానిపై స్పష్టత కూడా ఇచ్చా. నేను ఎలాంటి ప్రయోజనాలను అడగలేదు. నేనెంత తీసుకోవడానికి అర్హుడినో నాకు తెలుసు. అలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇది మరింత నిరుత్సాహపరిచింది. ఇప్పటికీ నన్ను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పలేదు.
ఆర్సీబీ తరఫున 140 మ్యాచ్లు ఆడుంటా. అయితే, సరైన సమాచారం ఇవ్వకుండానే నన్ను పక్కన పెట్టారు. రిటెయిన్ చేసుకోకపోయినప్పటికీ వేలంలో తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. కానీ, వేలం సందర్భంగా ఒక్క బిడ్ కూడా వేయలేదు. దాంతో నాకు ఆర్సీబీపై విపరీతమైన కోపం వచ్చింది. వారి కోసం ఎనిమిదేళ్లు ఆడినా పట్టించుకోలేదు. నాకు చిన్నస్వామి స్టేడియం అంటే చాలా ఇష్టం. అయ్యిందేదో అయింది. అదంతా మంచికే జరిగిందని నమ్ముతున్నా. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చిన తర్వాత నేను డెత్బౌలర్గా మారా. చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ప్రారంభించా. గతంలో ఆర్సీబీ తరఫున చివరిగా 16 లేదా 17వ ఓవర్ వేసేవాడిని. ఇప్పుడు రాజస్థాన్ జట్టు తరఫున డెత్ ఓవర్లలో బౌలింగ్ వేస్తున్నా. అప్పటికి, ఇప్పటికీ నా ఆట 5 నుంచి 10 శాతం పెరిగింది. దీంతో అప్పుడు జరిగిందంతా మన మంచికే అనుకుంటున్నా’’ అని చాహల్ తెలిపాడు.
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత జరిగిన వేలంలో చాహల్ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. చాహల్ కోసం ఆర్సీబీ ఒక్క బిడ్ వేయకపోవడం గమనార్హం. దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తీవ్ర పోటీ వచ్చింది. చివరికి సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు చాహల్ను రూ. 6.50 కోట్లకు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.