Chahal: వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఒక్క బిడ్ కూడా వేయలేదు: చాహల్
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) టీ20 క్రికెట్లో అద్భుత ఆటతీరున ప్రదర్శిస్తున్నాడు. అయితే, రెండేళ్ల కిందట ఆర్సీబీ తరఫున ఆడిన చాహల్ను ఆ జట్టు రిటెయిన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చాడు. అక్కడ రాజస్థాన్ కొనుగోలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (IPL) సీజన్ ముగిసిన తర్వాత యుజ్వేంద్ర చాహల్ను (Chahal) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమతో అట్టిపెట్టుకోలేదు. ఆ సమయంలో ఆర్సీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు బెంగళూరు తరఫున ఆడిన చాహల్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అయినా, అతడిని రిటెయిన్ చేసుకోలేదు. కనీసం అతడిని పక్కన పెట్టడానికి కారణమేంటో కూడా చాహల్కు చెప్పకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై చాహల్ స్పందించాడు.
‘‘2014లో బెంగళూరు జట్టుతో నా ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ నా మీద నమ్మకంతో ఉన్నాడు. అయితే, నన్ను రిటెయిన్ చేసుకోకపోవడం తీవ్రంగా బాధించింది. ఎనిమిదేళ్లపాటు ఫ్రాంచైజీ కోసం ఆడాను. కనీసం కారణం కూడా చెప్పకపోవడం ఆవేదనకు గురి చేసింది. కొంతమంది నేనే ఎక్కువగా డబ్బు అడిగినట్లు మాట్లాడుకోవడం నా దృష్టికి వచ్చింది. అందుకే పలు ఇంటర్వ్యూల్లో దానిపై స్పష్టత కూడా ఇచ్చా. నేను ఎలాంటి ప్రయోజనాలను అడగలేదు. నేనెంత తీసుకోవడానికి అర్హుడినో నాకు తెలుసు. అలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇది మరింత నిరుత్సాహపరిచింది. ఇప్పటికీ నన్ను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పలేదు.
ఆర్సీబీ తరఫున 140 మ్యాచ్లు ఆడుంటా. అయితే, సరైన సమాచారం ఇవ్వకుండానే నన్ను పక్కన పెట్టారు. రిటెయిన్ చేసుకోకపోయినప్పటికీ వేలంలో తీసుకుంటామని నాకు హామీ ఇచ్చారు. కానీ, వేలం సందర్భంగా ఒక్క బిడ్ కూడా వేయలేదు. దాంతో నాకు ఆర్సీబీపై విపరీతమైన కోపం వచ్చింది. వారి కోసం ఎనిమిదేళ్లు ఆడినా పట్టించుకోలేదు. నాకు చిన్నస్వామి స్టేడియం అంటే చాలా ఇష్టం. అయ్యిందేదో అయింది. అదంతా మంచికే జరిగిందని నమ్ముతున్నా. రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చిన తర్వాత నేను డెత్బౌలర్గా మారా. చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ప్రారంభించా. గతంలో ఆర్సీబీ తరఫున చివరిగా 16 లేదా 17వ ఓవర్ వేసేవాడిని. ఇప్పుడు రాజస్థాన్ జట్టు తరఫున డెత్ ఓవర్లలో బౌలింగ్ వేస్తున్నా. అప్పటికి, ఇప్పటికీ నా ఆట 5 నుంచి 10 శాతం పెరిగింది. దీంతో అప్పుడు జరిగిందంతా మన మంచికే అనుకుంటున్నా’’ అని చాహల్ తెలిపాడు.
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత జరిగిన వేలంలో చాహల్ను రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. చాహల్ కోసం ఆర్సీబీ ఒక్క బిడ్ వేయకపోవడం గమనార్హం. దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తీవ్ర పోటీ వచ్చింది. చివరికి సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ జట్టు చాహల్ను రూ. 6.50 కోట్లకు దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక