Road Accidents: అధిక వేగంతోనే 84% ప్రమాదాలు
డ్రైవర్ల నిర్లక్ష్యంతో రక్తమోడుతున్న రహదారులు
2014 నుంచి 2.57 లక్షల ఘటనలు.. 83 వేల మరణాలు

వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి... మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి... అనేక కుటుంబాల్ని రోడ్డుపాలు చేస్తున్నాయి... 2024లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో 84 శాతం ఘటనలకు ఇవే కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2025 జులై వరకు తెలంగాణవ్యాప్తంగా 2.57 లక్షల ప్రమాదాలు జరిగాయి. 83 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
గుంతలను తప్పించే క్రమంలో....
నిర్వహణ లోపాలతో పలుచోట్ల రహదారులపై గుంతలు ఏర్పడుతున్నాయి. వేగంగా వెళ్తున్న వాహనదారులు గుంతలు కనిపించగానే వాహనాన్ని పక్కకు తప్పిస్తున్నారు. కానీ, ఆ క్రమంలో వేగాన్ని తగ్గించడం లేదు. దీంతో పక్క నుంచి వెళ్లే, ఎదురుగా వచ్చే ఇతర వాహనాల్ని ఢీకొంటున్నారు. పలు రోడ్ల మధ్యలో డివైడర్ లేకపోవడంతో ముందు వెళ్తున్న వాహనాల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాల్ని ఢీకొడుతున్నారు. ఓవర్లోడ్తో ప్రయాణించే వాహనాలు ఎక్కువ వేగంగా వెళ్తోంటే గుంతల్ని తప్పించే క్రమంలో అదుపులో ఉండటం లేదు.
ప్రధాన కారణాలు
- అధిక వేగం, మద్యం తాగి నడపడం
 - ఓవర్ లోడ్, వాహనాల్లో నిర్వహణ లోపాలు
 - రోడ్లు సరిగ్గా లేకపోవడం, తగినన్ని లేదా అసలే సిగ్నళ్లు లేకపోవడం
 - ప్రతికూల వాతావరణం, ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనబడకపోవడం
 
ఏటేటా పెరుగుతున్నాయ్..
రాష్ట్రంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2014లో 20,078 జరగగా... 2019లో 21,570కి పెరిగాయి. 2024లో రికార్డుస్థాయిలో 25,986 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏటా సగటున 22 వేల మంది గాయపడుతున్నారు. దేశంలో ప్రమాదాల సంఖ్యలో రాష్ట్రం 8వ స్థానంలో, మరణాల్లో 10 స్థానంలో ఉండటం ప్రమాదాల తీవ్రతకు నిదర్శనం.

2024లో ప్రమాదాలు ఇలా.. (శాతాల్లో)
అధిక వేగంతో 84
రాంగ్సైడ్ డ్రైవింగ్ 4
డ్రంకెన్ డ్రైవింగ్ 2
ఇతర కారణాలు 10 

ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

69 కి.మీ.. 50 మృత్యు మలుపులు
69 కిలోమీటర్ల దూరం.. ఐదేళ్లలో 720 ప్రమాదాలు.. 211 మంది మృతి... 737 మంది క్షతగాత్రులు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నవారు వేలల్లో.. ఇది హైదరాబాద్- బీజాపూర్ (విజయపుర) జాతీయ రహదారి రక్తచరిత్ర. - 
                                    
                                        

తెలంగాణలో 47.6% ఉపాధి హామీ పనిదినాల తగ్గుదల
తెలంగాణలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 47.6% పనిదినాలు తగ్గినట్లు లిబ్టెక్ ఇండియా అధ్యయన నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్బాబు అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే వైద్య చికిత్సలను చేయిస్తుందన్నారు. - 
                                    
                                        

మిగులు టీచర్లు... 10 వేల మంది!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 వేల మంది మిగులు ఉపాధ్యాయులున్నారని పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 24,238 పాఠశాలలు ఉండగా... 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. - 
                                    
                                        

ముడుపులు ఇచ్చిన.. పుచ్చుకున్నవారిపైనా చర్యలు
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముడుపులు ఇచ్చినవారిపైనా.. పుచ్చుకున్నవారిపైనా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. - 
                                    
                                        

ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతారు?
మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం చేస్తూ కేటీఆర్ పగటి కలలు కంటున్నారని.. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ సీఎం ఎలా అవుతారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. - 
                                    
                                        

ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందర్నీ మోసం చేశారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్రెడ్డికి అందర్నీ మోసం చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. - 
                                    
                                        

కోకాపేట.. ఎకరం రూ. 99 కోట్లు!
హెచ్ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారం రసవత్తరం
జూబ్లీహిల్స్ అమాత్యుల అడ్డాగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్ఠానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ పూర్తిచేసి తీరతాం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ)ను పూర్తిచేస్తే కాంగ్రెస్కు పేరొస్తుందనే రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్లు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. - 
                                    
                                        

మృత్యు ప్రయాణం
కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు.. వ్యాపార పనులకోసం కొందరు.. ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు.. సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


