Ponguleti: ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. హమీలను నెరవేరుస్తున్నాం: పొంగులేటి

Eenadu icon
By Telangana News Team Published : 09 Sep 2025 15:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కూసుమంచి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రూ.8.19 లక్షల కోట్లు అప్పు చేసిందని, పేదవారికి కష్టం కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే మూడేళ్లలో అర్హులైనవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటించారు. కూసుమంచి మండలంలోని నాయకన్‌ గూడెంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. నర్సింహులగూడెం గ్రామంలో కిష్టాపురం నుంచి నర్సింహులగూడెం వరకు రూ.1.33 కోట్లతో చేపట్టనున్న పీఆర్‌ రోడ్డు మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని