నీట్‌ సూపర్‌స్పెషాలిటీ ఫలితాల విడుదల

Eenadu icon
By Telangana News Desk Published : 26 Apr 2025 04:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ- 2025 ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మెడికల్‌ సైన్సెస్‌ శుక్రవారం విడుదల చేసింది. ఏపీ వైద్య విద్యార్థిని పొట్లూరి బేబీ శ్వేత పల్మనాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. విజయవాడకు చెందిన శ్వేత ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్‌(రెస్పిరేటరీ మెడిసిన్‌)లో పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు 15 ఆసుపత్రుల్లో మాత్రమే 55వరకూ పల్మనాలజీ సీట్లు ఉన్నాయి. బేబీ శ్వేత ఏపీ ఎంసెట్‌ (2012)లో 234వ ర్యాంకు సాధించారు. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. నీట్‌ పీజీ ద్వారా 9746 ర్యాంకు సాధించి రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో రెస్పిరేటరీ మెడిసిన్‌ పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు