రెవెన్యూ భూముల లెక్కలు తీయండి.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

Eenadu icon
By Telangana News Desk Published : 07 Oct 2025 04:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: గడిచిన 30, 40 ఏళ్ల నుంచి వివిధ అవసరాలకు రెవెన్యూశాఖ ఇతర శాఖలకు కేటాయించిన భూముల లెక్కలు తీయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ‘రెవెన్యూశాఖ గతంలో కేటాయించిన భూముల వివరాలు, వినియోగం, ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలి. ప్రధానంగా నీటిపారుదల, అటవీశాఖలకు పెద్ద ఎత్తున భూములు అప్పగించింది. రాష్ట్ర విభజన తరువాత కొన్ని ప్రాజెక్టులు రద్దయ్యాయి. మరికొన్నింటిలో మార్పు చేర్పులు జరిగాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల లెక్కలు తేల్చాలి. సీతారామ ఎత్తిపోతలకు ఉమ్మడి ఖమ్మంలో 1,138 ఎకరాల అటవీ భూముల కేటాయింపు ప్రక్రియలో వేగం పెంచాలి. కేశవాపురం తాగునీటి పథకం కోసం రెవెన్యూశాఖ అటవీశాఖకు 1,030 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు రద్దు అయినందున ఆ భూమిని సీతారామ ఎత్తిపోతలకు బదలాయించాలి’ అని మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు