తేమ 20% ఉన్నా కొనుగోలు చేయాలి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రికి తుమ్మల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో వరుస వర్షాలు, భిన్నమైన వాతావరణ పరిస్థితులతో పత్తిలో తేమ 10-12% వరకు ఉంటోందని, 20% వరకు అనుమతించి కొనుగోలు చేసేలా సీసీఐని ఆదేశించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు. సోమవారం కేంద్రమంత్రి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..‘ ప్రస్తుతం పత్తిలో 8-10% తేమ ఉంటేనే సీసీఐ కొనుగోళ్లు చేపడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు, చలితో నిర్ణీత తేమ శాతం ఉండడం లేదు. రైతుల ప్రయోజనార్థం ప్రస్తుత నిబంధనలను సడలించాలి. ధరల మద్దతు పథకం కింద పెసర, మినుములు, సోయాబీన్‌ల కొనుగోలుకు అనుమతించాలని పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలి. జొన్న, మొక్కజొన్నలను సైతం కొనుగోలు చేసేందుకు ఆదేశాలివ్వాలి’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు