ఆటోలపై రూ.42 కోట్ల చలానాలు విధించారు

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 04:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

భారత రాష్ట్ర సమితి సర్కార్‌పై ఎంపీ చామల ఆరోపణ

హైదరాబాద్, న్యూస్‌టుడే: భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలో ఆటోలపై రూ.42 కోట్ల చలానాలు విధించి డ్రైవర్లను వేధించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఆటో డ్రైవర్లను పట్టించుకోని కేటీఆర్‌.. జూబ్లీహిల్స్‌ ఎన్నిక సమయంలో కొత్త డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ‘మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో భారత రాష్ట్ర సమితి నేతలు చెప్పాలి. ఆనాడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో కేంద్రంలోని ప్రతి శాఖ నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల నిధులు అగిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తోంది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని