దివ్యాంగుల సంక్షేమం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం: రామచందర్‌రావు

Eenadu icon
By Telangana News Desk Published : 29 Oct 2025 05:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: దివ్యాంగుల ఫించన్‌ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి కాంగ్రెస్‌ సర్కారు విస్మరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. మంగళవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ దివ్యాంగుల సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ కొల్లి నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో దివ్యాంగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాల లాంటి ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తోందని, రిజర్వేషన్లు కల్పిస్తూ ఉపాధి అవకాశాల విస్తరణకు కృషి చేస్తోందన్నారు. జూబ్లీహిల్స్‌లో దివ్యాంగులు భాజపాకు మద్దతిచ్చి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. 

కేంద్ర క్యాబినెట్‌ రైతులకు మేలు చేసేలా ఎరువులపై పోషకాధారిత రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని రామచందర్‌రావు ఒక ప్రటకలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు