మావోయిస్ట్‌ చీఫ్‌గా దేవ్‌జీ నియామకం అబద్ధం

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చంద్రన్న మోసపూరిత ప్రచారాన్ని ఖండించండి
పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి గణేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ చీఫ్‌ నంబాల కేశవరావు ఎలియాస్‌ బస్వరాజ్‌ మరణానంతరం దేవ్‌జీని ఆ స్థానంలో నియమించినట్లు లొంగిపోయిన కేంద్రకమిటీ సభ్యుడు చంద్రన్న చెప్పింది వాస్తవవిరుద్ధమని ఆ పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శి గణేశ్‌ పేరుతో బుధవారం ప్రకటన వెలువడింది. బస్వరాజ్‌ మరణానంతరం కేంద్రకమిటీ సమావేశం నిర్వహించే పరిస్థితే లేదన్నారు. పోలీసులకు లొంగిపోయిన చంద్రన్న తనకు తాను విప్లవకారుడిగా చెప్పుకొనే హక్కు కోల్పోయారని విమర్శించారు. భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తానని ఆయన చెప్పడం నగరవాసి హోదా కోసం వేసుకున్న ముసుగు మాత్రమే అని మండిపడ్డారు. భారత విప్లవోద్యమం ప్రస్తుతం తాత్కాలిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. మావోయిస్టు పార్టీ దీన్ని అధిగమించి ముందుకు సాగుతుందని తెలిపారు. నిరుద్యోగం, సామాజిక-ఆర్థిక అసమానతల వంటి సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనందున ప్రజలు సాయుధ తిరుగుబాటును ఆశ్రయించాల్సిందేనని, విజయం అంతిమంగా ప్రజలదే అనేది చారిత్రక సత్యమని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు