10న కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ల సాధన సభ

Eenadu icon
By Telangana News Desk Published : 31 Oct 2025 04:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జస్టిస్‌ వి.ఈశ్వరయ్య వెల్లడి

మాట్లాడుతున్న జస్టిస్‌ ఈశ్వరయ్య, వేదికపై విశారదన్‌ మహారాజ్, బాల్‌రాజ్‌గౌడ్, చిరంజీవులు

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అన్నారు. ఇందులో భాగంగా నవంబరు 10న కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ల సాధన సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ‘‘నవంబరు 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని సంఘాల సమన్వయంతో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్లు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తాం. 6న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించి వినతిపత్రం సమర్పిస్తాం. 7న రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం ఉంటుంది’’ అని తెలిపారు. గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ‘భవిష్యత్తు.. ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక’ అంశంపై నిర్వహించిన సమావేశంలో జస్టిస్‌ ఈశ్వరయ్య పాల్గొని ప్రసంగించారు. ‘42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే ఈ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చడమే ఏకైక మార్గమని ప్రతిపాదిస్తే కొందరు దీనిపై వితండవాదం చేస్తున్నారు. 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది’’ అని అన్నారు. కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు టి.చిరంజీవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ విశారదన్‌ మహారాజ్, బీసీ పొలిటికల్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్‌ వెంకన్నగౌడ్, బీసీఎఫ్‌ నేత ఎస్‌.దుర్గయ్యగౌడ్, ఏపీ బీసీ నేత ఆల్మండ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు