TG Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే పైచేయి

Eenadu icon
By Telangana News Team Updated : 22 Apr 2025 13:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో (Telangana Inter results) మొదటి సంవత్సరం 65.96 శాతం, ద్వితీయ సంవత్సరం 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మొత్తం 9.97లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. 

ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 73.08 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో బాలురు 59.74 శాతం, సెకండియర్‌లో 64.60 శాతం మంది పాసయ్యారు.  ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 77.21 శాతంతో మొదటి స్థానంలో.. 48.43 శాతంతో మహబూబాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లా 80.12 శాతంతో టాప్‌లో ఉండగా.. కామారెడ్డి జిల్లా 54.93శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)

మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్‌ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 19 కేంద్రాల్లో పేపర్ల వాల్యూయేషన్‌ చేపట్టామన్నారు. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు వారం గడువు ఇస్తున్నట్లు చెప్పారు.  మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రీ వెరిఫికేషన్‌కు రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 ఫీజుగా నిర్ణయించినట్లు చెప్పారు.

Tags :
Published : 22 Apr 2025 13:02 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు