Kavitha: 20 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. అవమానాలు ఎదుర్కొన్నా: కవిత

లండన్: పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. లండన్లోని తెలంగాణ ప్రవాసులతో కవిత ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్గా నిలపాలన్నదే సంకల్పమని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందన్నారు. ‘‘అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతాం. ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంపై స్పష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా నాకు అవకాశం వస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ. అభివృద్ధి పథంలో సాగుతున్న తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. భాజపా డీఎన్ఏ నాకు సరిపడదు.
20 ఏళ్లు భారత రాష్ట్ర సమితి కోసం కష్టపడ్డాను. కొందరిలో స్వార్థం పురుడుపోసుకుంది. వారివల్ల కోట్లాది మంది బాధపడొద్దన్నదే నా తపన. పార్టీలో చీలికలు రావొద్దని ఎంత ఇబ్బందైనా తట్టుకొని నిలబడ్డాను. పార్టీలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. నా ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. విషయం ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాటిపై స్పందించకపోతే తప్పవుతుంది. అందుకే మాట్లాడాల్సి వచ్చింది. పార్టీ నన్ను వద్దనుకుంది కాబట్టే.. పార్టీ ఇచ్చిన పదవిని వద్దనుకున్నాను. నిర్ణీత నమూనాలో రాజీనామా చేశాను. ఛైర్మన్ ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. నేను ఈ పరిస్థితికి రావడానికి అవతలి వాళ్లే కారణం. కష్టమవుతుందని తెలిసినా.. కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా పంథాను ఎంచుకుంటాను. జైలు జీవితం నాలో అనేక మార్పులు తీసుకొచ్చింది. సమూలంగా మార్చేసింది. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలి’’ అని కవిత అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఫ్రిజ్ వంటగదిలో ఉందా..?
మీ ఇంట్లో ఫ్రిజ్ ఎక్కడుంది..? వంటగదిలోనే ఉంది... అని అంటారా..! అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు అగ్నిమాపక అధికారులు..! - 
                                    
                                        

స్పాంజ్లా దారులు.. హాయిగా నగరాలు!
నీటిని స్పాంజ్ పీల్చుకున్నట్లు వరదను రోడ్లే పీల్చుకుంటే..! ఈ నీరే భూగర్భంలో నిలిచి తిరిగి కరవు సమయంలో ఉపయోగపడితే..? చైనా రూపొందించిన ‘స్పాంజ్ సిటీ’ ఆవిష్కరణ సరిగ్గా ఇలాగే ఉంటుంది!! - 
                                    
                                        

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. - 
                                    
                                        

భద్రాద్రి రామయ్యకు రూ.50 లక్షల విలువైన వెండి గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి గజవాహనాన్ని భక్తులు కానుకగా సమర్పించారు.
 - 
                                    
                                        

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
ఆదిలాబాద్లో విమానాశ్రయం కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. - 
                                    
                                        

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. - 
                                    
                                        

కబళించిన రోడ్డు ప్రమాదం.. చేవెళ్ల ఘటనతో కుటుంబాలు చిన్నాభిన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో 19 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.
 - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమని చెప్పారు. - 
                                    
                                        

నుజ్జునుజ్జయిన బస్సు.. భయానకంగా చేవెళ్ల ప్రమాద స్థలి దృశ్యాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 - 
                                    
                                        

ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. - 
                                    
                                        

ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ హృదయ విదారక చిత్రాలు..
 - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. - 
                                    
                                        

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
చేవెళ్లలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (chevella Road Accident) ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. - 
                                    
                                        

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నం!
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన చోట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన ఎదురైంది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. - 
                                    
                                        

టిప్పర్ రాంగ్రూట్లో రావడంతోనే ప్రమాదం..! : మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


