KTR: ఇందిరమ్మ రాజ్యం అంటే అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టడమే
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ
గతంలో రాహుల్గాంధీ ప్రయాణించిన ఆటోలో తెలంగాణ భవన్కు..

ఆటోలో తెలంగాణ భవన్కు వస్తున్న కేటీఆర్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, ఫిల్మ్నగర్-న్యూస్టుడే: రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూలగొట్టడం, ఆటో డ్రైవర్ల ఉసురు తీయడం, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టడమేనని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా కింద ఆటోల మూడు చక్రాలు నలిగిపోయాయని ధ్వజమెత్తారు. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు తీసుకునే నిర్ణయంతో.. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ‘ఆటో అన్నతో మాట-ముచ్చట’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రయాణించిన ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. రాహుల్ గాంధీ ఆటోలో తిరిగినప్పుడు రెండు ఆటోలకు యజమానిగా ఉన్న మష్రత్ అలీ.. ప్రస్తుతం ఆ రెండింటినీ అమ్ముకుని డ్రైవర్గా మారారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్కు చేరుకున్న అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి.. ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
ఒక్కో యువతికి రూ.60 వేలు బాకీ పడిన ప్రభుత్వం
ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంది. తులం బంగారం ఇస్తామని చెప్పి.. మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు కష్టాల కడలిలో చిక్కుకున్నారు. నెలకు రూ.2,500 చొప్పున ఒక్కో యువతికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేదని, ఇప్పుడు పోలీసులు అందరినీ భయపెడుతున్నారని ఆరోపించారు. తుపాకీతో బెదిరించిన వ్యక్తిని మంత్రి కొండా సురేఖ.. తన కారులో తీసుకెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.
ఆటో కార్మికుల ఓట్లు దండుకుని మోసం చేశారు: హరీశ్రావు

ఆటోలో ప్రయాణిస్తున్న హరీశ్రావు, మాధవరం కృష్ణారావు
అమీర్పేట, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులకు మాయమాటలు చెప్పి వారి ఓట్లు దండుకుని మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు హైదరాబాద్కు వచ్చిన రాహుల్గాంధీ ఆటో ఎక్కి..కార్మికులను ఉద్ధరిస్తానంటూ చెప్పిన హామీలేవీ నెరవేరలేదని ఆక్షేపించారు. ‘ఆటో అన్నతో మాట-ముచ్చట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆటోలో ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు ప్రయాణించారు. అంతకుముందు ఎర్రగడ్డలో మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామనే హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఒక్కో కుటుంబానికి బకాయిపడ్డ రూ.24 వేలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై హరీశ్రావు స్పందిస్తూ మంత్రి వర్గంలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. కొప్పుల ఈశ్వర్ సవాల్ను స్వీకరించి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వద్దకు రావాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా..!
మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడంలేదు. హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల.. లోపల.. అనేక ‘మార్గాల్లో’ అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. - 
                                    
                                        

ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్.. ఐ-ఎలర్ట్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా బస్సుల్లో ఐ-ఎలర్ట్ పరికరాన్ని అమరుస్తున్నారు. - 
                                    
                                        

ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్!
మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలున్నా.. కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. అధికారయంత్రాంగంలోని కొందరు షరా ‘మామూలు’గా చూసీచూడనట్లు ఉంటున్నారు. - 
                                    
                                        

ధర్మపురి ఆలయాన్నిసమగ్రంగా అభివృద్ధి చేస్తాం
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకూ సంపూర్ణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. - 
                                    
                                        

ఏడు క్వింటాళ్ల పరిమితి నిబంధనను సీసీఐ ఎత్తివేయాలి
ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేయాలనే సీసీఐ నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. - 
                                    
                                        

నెలాఖరులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. రూ.123 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. - 
                                    
                                        

జూబ్లీహిల్స్ ప్రచారంలో నిర్లక్ష్యం వద్దు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ నిర్లక్ష్యం చూపించవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. - 
                                    
                                        

వ్యవసాయ విద్యలో సంయుక్త బీఎస్సీ కోర్సు
దేశంలో తొలిసారిగా.. నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ కోర్సును సంయుక్తంగా నిర్వహించేందుకు తెలంగాణ అగ్రి వర్సిటీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెస్టర్న్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. - 
                                    
                                        

మోడల్ స్కూళ్లను విద్యాశాఖలో విలీనం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలోని 3 వేల మంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా.. మోడల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విన్నవించారు. - 
                                    
                                        

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం నిర్వహించండి
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆరోగ్య కార్డుల జారీపై ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) కోరింది. - 
                                    
                                        

ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. మహారాష్ట్రకు సంబంధించి ఇలాంటి కేసుపైనే ఏప్రిల్ 22న సుప్రీంకోర్టులోని మరో ధర్మాసనం... - 
                                    
                                        

ఇది న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే!
తెలంగాణ హైకోర్టులో తనను జడ్జిగా నియమించాలంటూ జి.వి.సర్వన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. - 
                                    
                                        

కేకు.. ఆలోచన కేక
ఇక్కడ కేకులపై కనిపిస్తున్న చిత్రాలు హైదరాబాద్లోని ట్రాఫిక్ జంక్షన్లవి. మరి ఇలా కేకులపై ఎందుకు ఏర్పాటు చేశారు అనుకుంటున్నారా? నగరంలో సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన కూడళ్లను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ... - 
                                    
                                        

రైల్వే స్టేషన్లే విద్యుత్ కేంద్రాలు
రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారాలపై లైట్లు, ఫ్యాన్లు, అనౌన్స్మెంట్ సిస్టమ్, టికెట్ కౌంటర్లు.. ఇలా అన్నింటికి కలిపి పెద్ద ఎత్తున విద్యుత్ కావాలి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 55 రైల్వేస్టేషన్లు, కార్యాలయ భవనాలకు ఇప్పుడు ఆ శక్తి సూర్యుడి నుంచే అందుతోంది. - 
                                    
                                        

ఓటు వేటలో నాగసాధువులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్కు మద్దతుగా వారణాసి నుంచి వచ్చిన 11 మంది సోమవారం ప్రచారం నిర్వహించారు. - 
                                    
                                        

రామచక్కని సీతమ్మకు.. చక్కనైన గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాద్కు చెందిన శంకర్నారాయణ-రాజ్యలక్ష్మి అనే దంపతులు రెండ్రోజుల కిందట రూ.40 లక్షల విలువైన రజత గజ వాహనాన్ని అందజేశారు. - 
                                    
                                        

కడలుంగీ.. రఘునాథపురం టు ఉగాండా
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో మరమగ్గాలపైన రూపుదిద్దుకుంటున్న కడలుంగీ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇక్కడి నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా దేశానికి సరఫరా అవుతోంది. - 
                                    
                                        

హైకోర్టు ఉద్యోగిని తెలంగాణకు తిరిగి కేటాయించడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన పీవీ సతీష్కుమార్ అనే హైకోర్టు ఉద్యోగిని తిరిగి తెలంగాణకు కేటాయించడానికి నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తంచేసింది. - 
                                    
                                        

జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం
వ్యాపార విస్తరణలో భాగంగా మరో జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. నాగ్పుర్లోని కేంద్ర గనులశాఖ అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం.. - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లు.. ఏడు క్వింటాళ్లకు కుదింపు
భారత పత్తి సంస్థ(సీసీఐ) తాజాగా మరో కఠిన నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఎకరాకు సగటున 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసే నిబంధనలను సోమవారం నుంచి కేవలం 7 క్వింటాళ్లకే పరిమితం చేయటం విస్మయానికి గురిచేసింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


