KTR: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారం.. కేటీఆర్‌ రోడ్‌ షో

Eenadu icon
By Telangana News Team Updated : 31 Oct 2025 20:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. షేక్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఓయూ కాలనీ మీదుగా వినోభానగర్‌ వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌, భారత రాష్ట్ర సమితి పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఓ కుటుంబం అని గోపీనాథ్‌ చెప్పేవారని.. మహిళలకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరించేవారని అన్నారు. కష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని అన్నారు.

Tags :
Published : 31 Oct 2025 20:08 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు