Uttam Kumar Reddy: ఎన్డీఎస్‌ఏ నివేదిక మేరకే మేడిగడ్డ మరమ్మతులు: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 07 Oct 2025 19:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి విషయంలో రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కాలువల విషయంలో ఈనెల 22 లోపు నిర్ణయం తీసుకుంటామన్నారు.

‘‘మైలారం ద్వారా సుందిళ్లకు ఒక కాలువ ప్రతిపాదన, నేరుగా ఎల్లంపల్లికి నీటి తరలింపు ఇంకో ప్రతిపాదన ఉంది. వ్యయం, హైడ్రాలిక్‌, ఇంధనం, అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రెండు ప్రతిపాదనలపై ఇంజినీర్లు 2 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కోరాం. 2027 డిసెంబర్‌ నాటికి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేయాలన్నది మా లక్ష్యం. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులు చేపడతాం. డిజైన్లు రూపొందించేందుకు జాతీయ నైపుణ్య సంస్థల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చాం. శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా మరమ్మతులు చేపడతాం. డిండి ఎత్తిపోతలపై అధికారులు 3 రోజుల్లోగా నివేదిక అందించాలి’’ అని ఉత్తమ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు