Uttam Kumarreddy: ‘బనకచర్ల’ విషయంలో హరీశ్‌రావు చెప్పినవన్నీ అవాస్తవాలే: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Published : 24 Jan 2025 19:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘భారాస హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగింది. మేం అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. భారాస పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. బనకచర్ల విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కి లేఖ రాశాం. ఏపీ పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధం, ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశాం’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని