Uttam: ఆపరేషన్‌ సిందూర్‌పై మేం రాజకీయం చేయడం లేదు: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana News Team Published : 31 May 2025 16:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: వాయుసేనకు ఫైటర్‌ జెట్స్‌, ఆయుధాలు సరైన సమయానికి అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘‘రఫేల్‌ విమానాలు కూలాయని రాహుల్‌ చెబితే దేశ వ్యతిరేకులు అన్నారు. రఫేల్‌ విమానాలు కూలాయని సీడీఎస్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సీడీఎస్‌ వ్యాఖ్యలపై ఏం చెప్తారు.. ఆయన్ని దేశ వ్యతిరేకి అంటారా? పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్స్‌ ఎన్ని కూలాయో కూడా స్పష్టం చేయాలి. సరిపడా యుద్ధ విమానాలు లేవు .. ఇది దేశానికి మంచిది కాదు. ఆపరేషన్‌ సిందూర్‌పై కాంగ్రెస్‌ రాజకీయం చేయడం లేదు. యుద్ధ విషయాలు ప్రపంచానికి బహిరంగంగానే చెప్పాలి. విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలి’’ అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని