MLC Kavitha: యశోద ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

Eenadu icon
By Telangana News Team Published : 04 Jul 2025 10:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) యశోద ఆసుపత్రికి వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌ (KCR) ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జ్వరం, మధుమేహ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన్ను కవిత పరామర్శించారు. 

గురువారం సాయంత్రం కేసీఆర్‌  సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. గత రెండు రోజులుగా కొంత నీరసంగా ఉండడంతో కేసీఆర్‌ గురువారం ఆసుపత్రికి వచ్చారు. ఆయనను పరీక్షించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు సూచనతో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు గురువారం రాత్రి 9.30 సమయంలో బులెటిన్‌ విడుదల చేశాయి. ‘‘నీరసంతో బాధపడుతూ కేసీఆర్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్‌ స్థాయులు అధికంగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు తేలింది. కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. షుగర్, సోడియం సాధారణ స్థాయికి వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారు’ అని హెల్త్‌ బులెటిన్‌లో డాక్టర్‌ ఎంవీ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఆయనతోపాటు ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. (Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని