Ponguleti Srinivas Reddy: లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు రేపటి నుంచి రెండో విడత శిక్షణ: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana News Team Updated : 17 Aug 2025 13:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు సోమవారం నుంచి రెండో విడత శిక్షణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. వారికి 23 జిల్లాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఆయా జిల్లాల్లో సోమవారం ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. అక్టోబర్‌ 2 నాటికి వీరి సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. (Telangana News)

Tags :
Published : 17 Aug 2025 12:44 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు