Karimnagar: నిట్లో సీటు.. రూ.4.59 లక్షలు కట్టే దారెటు..

హుజూరాబాద్ గ్రామీణం, న్యూస్టుడే: కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆ దంపతులు తమ కుమారులనైనా ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలు చిన్ననాటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రముఖ కళాశాలల్లో సీట్లు సాధించారు. నాలుగేళ్ల క్రితం పెద్దకుమారుడు ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించగా... ఫీజులు తరువాత కట్టేలా కళాశాలలో ప్రత్యేక అనుమతులు తీసుకొని చదివిస్తున్నారు. ప్రస్తుతం చిన్నకుమారుడు వరంగల్ నిట్లో సీటు సాధించాడు. ఇక అప్పు కూడా పుట్టే మార్గం లేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్కు చెందిన నీరటి అశోక్, లలిత దంపతుల చిన్నకుమారుడు రిషీ అల్గునూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివాడు.రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిలోని ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 941 మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. జేఈఈ మెయిన్స్లో 96.98 పర్సంటైల్ సాధించగా, జేఈఈ అడ్వాన్స్డ్లో 4,797 ర్యాంకు వచ్చింది. వరంగల్ నిట్లో ఈసీఈ(వీఎల్ఎస్ఐ) విభాగంలో సీటు దక్కింది. అయితే మొదటి సంవత్సరంలో చేరాలంటే అన్నిరకాల ఫీజుల కోసం రూ.1.48 లక్షలు కట్టాలని చెబుతున్నారు. మిగిలిన మూడేళ్లకు ఏడాదికి రూ.1,03,500 చొప్పున ఖర్చవుతుంది. మొత్తం నాలుగేళ్లకు రూ.4.59 లక్షలు కావాలి. తమ కుటుంబానికి ప్రస్తుతం అంత స్తోమత లేదని, దాతలు చేయూత అందించాలని రిషీ, అతని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


