Ponguleti Srinivasa Reddy: హైకోర్టు తీర్పుతో 9లక్షలకుపైగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana News Team Published : 26 Aug 2025 20:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: సాదాబైనామాల అంశంపై హైకోర్టు స్టే తొలగించడంతో ఆ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమమైందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. భూభారతి చట్టం.. సాదాబైనామాల పరిష్కారానికి దారి చూపిందని, త్వరలో 9 లక్షలకు పైగా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని అన్నారు. హైకోర్టు తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సాదాబైనామాల విషయంలో గత ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.. కానీ, పరిష్కారం చూపలేదన్నారు. ఫలితంగా 9.26లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా నిలిచిపోయాయని, కొందరు హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ పూర్తి చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు