Uttam Kumar Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం.. సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

Eenadu icon
By Telangana News Team Published : 08 Mar 2025 12:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆయన చర్చించారు. సొరంగంలో జరిగిన ప్రమాదాల్లో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని చెప్పారు.

‘‘14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్‌ చేసే వాళ్లకూ ప్రమాదం ఉంది. అందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం. కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకేచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించారు. ఆచూకీ తెలియకుండా పోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం’’ అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. (Telangana News)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని