పాఠం చెప్పేదెవరు?
మెదక్ జిల్లా రేగోడు మండలం జెగిర్యాల్ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు, మరో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హెచ్ఎం మరో బహుళ జోన్కు
చాలాచోట్ల బదిలీ స్థానాలను భర్తీ చేయని విద్యాశాఖ
విద్యా వాలంటీర్ల నియామకమూ లేదు
కొన్ని హైస్కూళ్లలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలకు ఒక్కరే టీచరు
మెదక్ జిల్లా రేగోడు మండలం జెగిర్యాల్ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు, మరో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హెచ్ఎం మరో బహుళ జోన్కు వెళ్లిపోగా... ఆ స్థానంలో ఎవరూ రాలేదు. ఖాళీగా ఉన్న అయిదు పోస్టులను కూడా భర్తీ చేయలేదు. విద్యా వాలంటీర్లను నియమించడం లేదు. మరి ఇప్పుడు ఆ విద్యార్థులకు పాఠాలు బోధించేదెవరు?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నత పాఠశాలల్లో విద్యా పరిస్థితులపై ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా టీచర్లు లేకపోవడంతో పిల్లలకు పాఠాలు ఎవరితో చెప్పించాలో తెలీక సతమతమవుతున్నారు. విద్యా వాలంటీర్లను నియమించలేదు. సబ్జెక్టు నిపుణుల కొరత తీరలేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులను బదిలీ చేసినా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. అలాంటి చోట్ల పాఠాలు చెప్పేదెవరనేది ప్రధానోపాధ్యాయులను వేధిస్తున్న ప్రశ్న. తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఉన్న చోట్ల ఒక్కో సబ్జెక్టుకు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడం సమస్యగా మారనుంది. పదో తరగతి పరీక్షల ఫీజుల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా సబ్జెక్టు నిపుణుల స్థానాలను భర్తీ చేయకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
హేతుబద్ధీకరణ లక్ష్యం నెరవేరింది ఎంత?
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా...అందులో సుమారు 23 వేల మంది జిల్లాలు మారారు. పోస్టింగులు కేటాయించడంలో పాక్షికంగా మాత్రమే హేతుబద్ధీకరణ చేశామని విద్యాశాఖ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. ఉపాధ్యాయులను కొంత వరకు సర్దుబాటు చేసినా పాఠశాలల హేతుబద్ధీకరణ కూడా జరిగితేనే సబ్జెక్టు నిపుణుల కొరత పూర్తిగా తీరుతుందని డీఈవో ఒకరు వ్యాఖ్యానించారు. ఉదాహరణకు 50 మంది విద్యార్థుల లోపున్న ఉన్నత పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. హైస్కూల్లో 10 మంది ఉన్నా ఒక ప్రధానోపాధ్యాయుడు, మరో ఏడుగురు సబ్జెక్టు నిపుణులను నియమించడం తప్పనిసరి. అలాంటి వాటిని సమీపంలోని వాటిల్లో విలీనం చేసినప్పుడే సబ్జెక్టు నిపుణుల కొరత తీరి విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని జిల్లా స్థాయి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఉపాధ్యాయులందరినీ ఇతర జిల్లాలకు పంపినా...అక్కడున్న పిల్లల్ని ఏం చేయబోతున్నామని మాత్రం విద్యాశాఖ ఇప్పటి వరకు చెప్పడం లేదు. ఈనెల 31 నుంచి మళ్లీ పాఠశాలలు తెరుచుకుంటే అక్కడ బోధించేదెవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కొన్ని చోట్ల ఇదీ పరిస్థితి...
* కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు మొత్తం 9 తొమ్మిది మంది. ఇక్కడ ఆరుగురు పనిచేస్తున్నారు. అయిదుగురు ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఒక్క హెచ్ఎం మాత్రమే ఉన్నారు. మరి తొమ్మిది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేదెవరు? ఈ పాఠశాలకు సమీప గ్రామాల్లో ఉన్నత పాఠశాలలున్నాయి? వాటిల్లో దీన్ని విలీనం చేస్తారా? దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
* మహబూబ్నగర్ జిల్లా పీసీకుంట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఉండగా జీవశాస్త్రం బోధించే ముగ్గురు ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు వెళ్లారు. తిరిగి ఇక్కడకు ఒక్కరే వచ్చారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ముగ్గురు ఉండగా...వారు వెళ్లి ఒక్కరే కొత్తగా వచ్చారు. అంటే తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులందరికి కలిపి ఒక ఉపాధ్యాయుడే బోధిస్తారా?
అదే జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయులు ఇద్దరు వెళ్లిపోగా...ఒక్కరూ రాలేదు. ఇక్కడే నవాబుపేట మండలం కారుకొండలో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ముగ్గురు గణితం ఉపాధ్యాయులు ఉండగా... వారు బదిలీ అయ్యారు. తిరిగి ఒక్కరే వచ్చారు.... ఇది దేనికి సంకేతం?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు. -
జగన్ పన్నాగం పారలేదు
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కోట్లు పంచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ అండ్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది. -
ప్రజా రాజధాని ప్రాణం తీసిన ‘ప్రజాద్రోహి జగన్’
అయిదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. నిర్మాణం పూర్తయ్యి ఉంటే- రాష్ట్రాభివృద్ధికి అది ఆయువుపట్టు అయ్యేది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆటపట్టుగా విరాజిల్లేది. -
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
సింహాచలంలో వైభవోపేతంగా చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారు శుక్రవారం నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?