వివిధ కమిషన్లకు ఛైర్మన్ల నియామకం

తెలంగాణ ఆర్థిక సంఘం(స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు.

Updated : 07 Jul 2023 12:38 IST

ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డి
స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌, ఇండస్ట్రియల్‌  డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లకు భిక్షపతి, తన్వీర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థిక సంఘం(స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్‌కు చెందిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2015లో భారాస(అప్పటి తెరాస)లో చేరారు. శాసనమండలి ఛైర్మన్‌గా కొంత కాలం పనిచేశారు. సభ్యులుగా హైదరాబాద్‌కు చెందిన గోసుల శ్రీనివాస్‌యాదవ్‌, నారాయణపేట్‌ జిల్లా మద్దూర్‌ మండలం రెనెవట్లకు చెందిన మహమ్మద్‌ సలీం నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్‌ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం మార్వెల్లికి చెందిన మటం భిక్షపతి, ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ తన్వీర్‌లను నియమించారు. భిక్షపతి గతంలో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు కాగా తన్వీర్‌ మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కుమారుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని