Indian Railway: వారం పాటు నాలుగు రైళ్ల రద్దు

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా నాలుగు రైళ్లను ఈనెల 24 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Published : 24 Jul 2023 07:37 IST

ఈనాడు, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా నాలుగు రైళ్లను ఈనెల 24 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), హెచ్‌.ఎస్‌.నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌.ఎస్‌.నాందేడ్‌ (07853) రైళ్లున్నాయి. మరో రెండు రైళ్లను 24-30 తేదీల మధ్య పాక్షికంగా రద్దు చేసింది. దాండ్‌-నిజామాబాద్‌ (11409) రైలు దాండ్‌ నుంచి ముద్కేడ్‌ వరకే రాకపోకలు సాగిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్‌-పంధర్‌పూర్‌ (01413) రైలు ముద్కేడ్‌ నుంచి పంధర్‌పూర్‌ మధ్యనే తిరుగుతుంది. కర్నూలు సిటీ-సికింద్రాబాద్‌ (17024) రైలు 25న నిర్ణీత సమయం కంటే 90 నిమిషాలు, గుంతకల్‌-బోధన్‌ (07671) రైలు ఈనెల 26, 27, 30 తేదీల్లో 120 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతాయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు