Higher pension: అధిక పింఛను ఆశావహులకు కాస్త ఊరట
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్-1, పార్ట్-2 విధానాన్ని ఈపీఎఫ్వో పక్కన పెట్టింది.
రవూర్కెలా ఫార్ములాను పక్కన పెట్టిన ఈపీఎఫ్వో
ఈపీఎస్ పేరా 12 ప్రకారమే పింఛను లెక్కించాలని స్పష్టత
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) అధిక పింఛను (Higher pension) ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్-1, పార్ట్-2 విధానాన్ని ఈపీఎఫ్వో పక్కన పెట్టింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) పేరా 12 కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పింఛను అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అర్హులందరికీ కొంత ఉపశమనం కలిగినట్లే. గౌరవప్రదమైన పింఛను లభించేందుకు మార్గం సుగమమైంది. దరఖాస్తులు పరిశీలించిన తరువాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ నుంచి.. పింఛను మంజూరయ్యే సమయం వరకు రావాల్సిన నెలవారీ పింఛను బకాయిల మొత్తంపై ఆదాయపన్ను (టీడీఎస్) మినహాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హతలపై ఈపీఎఫ్వో వివరణ ఇచ్చింది. పింఛను లెక్కింపుపై స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మొదలు పెట్టాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఈపీఎస్ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే పింఛను మంజూరు పత్రాలు జారీచేసి, బకాయిలు విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించబోమని.. అవసరమైన పత్రాలన్నీ ఉద్యోగి లేదా యజమాని నుంచి తీసుకుని పరిశీలిస్తామని వెల్లడించింది. ఒకవేళ అర్హత లేకుంటే దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొంది.
ఈపీఎఫ్వో ఏం చెప్పిందంటే..
- ఉదాహరణకు ఒక ఉద్యోగి 2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేశారనుకుందాం. ఆ ఉద్యోగికి పింఛను చెల్లింపు 2014 సెప్టెంబరు 1కి ముందు ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కిస్తారు.
- మరో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు.. 58 ఏళ్ల వయసు నిండకుండానే ఉద్యోగ విరమణ చేశారనుకుందాం. అలాగే మరో కేసులో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 తరువాత 58 ఏళ్లు నిండాక పదవీ విరమణ చేశారనుకుందాం. వీరిద్దరికీ 2014 సెప్టెంబరు 1 తరువాత నుంచి పింఛను ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.. వారి చివరి 60 నెలల సగటు వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్క కడతారు.
- ‘ఎ’ అనే ఒక ఉద్యోగి ఓ సంస్థలో 2015 జనవరి 1 నాటికి 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారనుకుందాం. అప్పుడు ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా కాకుండా.. 58 ఏళ్లుగానే లెక్కిస్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే ఈపీఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లే. దీని ప్రకారం ఆయన ఉద్యోగ విరమణ 2014 సెప్టెంబరు 1 కన్నా ముందుగానే అయినట్లు పరిగణిస్తారు. దీంతో ఈపీఎస్ నుంచి బయటకు వచ్చిన నాటికి చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పింఛను అర్హత వేతనాన్ని ఖరారు చేస్తారు.
- ఉదాహరణకు ‘బి’ అనే ఉద్యోగి ఓ సంస్థలో 50 ఏళ్లకే (2012 జనవరి 1 నాటికి) ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు 58 ఏళ్ల తర్వాత నుంచి.. అంటే 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగ విరమణ చేసిన నాటికి చివరి 60 నెలల సగటు వేతనాన్ని తీసుకుని పింఛను లెక్కిస్తారు.
- ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి 2030లో పదవీ విరమణ చేస్తారనుకుంటే, ఆయన పదవీ విరమణ చేసిన తరువాత పింఛను లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-1995 చట్టంలో అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు పింఛను లెక్కిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ వ్యవస్థనూ ‘వదల్లేదు!’
ఐదేళ్ల వైకాపా పాలనలో ప్రతి రాజ్యాంగబద్ధ వ్యవస్థపైనా జగన్ దాడికి దిగారు. తన అనుయాయుల్ని, అనుచరగణాన్ని ఉసిగొల్పారు. న్యాయవ్యవస్థపైనా దాడి చేయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై దాడికి దిగారు. కార్యనిర్వాహక వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, అధికారుల్ని భయభ్రాంతుల్ని చేసి చెప్పినట్టల్లా ఆడించారు. -
డాక్టర్ సునీతకు ప్రతిష్ఠాత్మక ఐడీఎస్ఏ ఫెలోషిప్
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అపోలో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత నర్రెడ్డి ప్రతిష్ఠాత్మక ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ఫెలోషిప్నకు ఎన్నికయ్యారు. -
ఓటేసేందుకు వైఎస్ భాస్కరరెడ్డికి అనుమతి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఏడో నిందితుడైన వై.ఎస్.భాస్కరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. 13న వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ రావాలని స్పష్టం చేసింది. -
ఇదీ సంగతి!
-
గాలివాన బీభత్సం
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం తరువాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. -
విద్యుత్ వినియోగంలో 6వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్ యూనిట్ల వినియోగంతో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. -
కాళేశ్వరం పంప్హౌస్ల మునకపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు పంప్హౌస్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని నీటి పారుదల శాఖ ఇంజినీర్లకు విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ సూచించారు. -
ఐఐటీల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు?
పాలిటెక్నిక్ పూర్తయిన విద్యార్థులు నేరుగా ఐఐటీల్లో బీటెక్ రెండో ఏడాదిలో చేరొచ్చా?.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఐఐటీ హైదరాబాద్ సైతం అందుకు కృషి చేస్తున్నాయి. -
వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డిలతోపాటు పలు జిల్లాల పరిధిలో ఆదివారం గాలి వాన, పిడుగులు పడిన ఘటనల్లో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. -
15న సీపీగెట్ నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నోటిఫికేషన్ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. -
ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేశారు. రెస్సాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 14న ఉదయం 10 గంటలలోపు వెబ్సైట్ నుంచే పంపించాలని కన్వీనర్ డీన్కుమార్, కో-కన్వీనర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. -
యాదాద్రిపై భక్తజన సందోహం!
దైవదర్శనాలు.. స్వామివారి కల్యాణం.. దీపారాధనలు.. మొక్కులు, వాహన పూజలు.. పుణ్య స్నానాలతో పంచనారసింహులు కొలువైన మహా పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం భక్తజన సందోహంగా మారింది. -
వీనులవిందుగా ‘రవీంద్రుని’ గీతాలాపన
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం 11 రాష్ట్రాల్లో ఒకేరోజు, ఒకే సమయంలో.. ఒకేసారి ఒక్కోచోట 100 మంది గాయకుల చొప్పున రవీంద్రనాథ్ ఠాగూర్ విరచిత 20 గీతాలను మధురంగా ఆలపించి ఆయనకు నివాళులర్పించారు. -
ముఖ్యమంత్రి ‘ఆట’విడుపు..!
కొద్దిరోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మైదానంలో విద్యార్థులతో కలిసి సందడి చేశారు. -
అంగన్వాడీ సిలబస్ మరింత సరళం!
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో మరింత నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయనుంది. -
సీఎంకు హైకోర్టు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు బార్ అసోసియేషన్ ఆదివారం కృతజ్ఞతలు తెలిపింది. -
బ్యాట్ పట్టిన అసదుద్దీన్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరకు ప్రచారంలో విరామం లేకుండా గడిపిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. -
అన్ని షిఫ్టుల కార్మికులకు వేతనంతో కూడిన సెలవు నేడు
పార్లమెంటు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం కర్మాగారాల కార్మికుల్లో అన్ని షిఫ్టుల వారికీ వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించింది.