Higher pension: అధిక పింఛను ఆశావహులకు కాస్త ఊరట
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్-1, పార్ట్-2 విధానాన్ని ఈపీఎఫ్వో పక్కన పెట్టింది.
రవూర్కెలా ఫార్ములాను పక్కన పెట్టిన ఈపీఎఫ్వో
ఈపీఎస్ పేరా 12 ప్రకారమే పింఛను లెక్కించాలని స్పష్టత
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) అధిక పింఛను (Higher pension) ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్-1, పార్ట్-2 విధానాన్ని ఈపీఎఫ్వో పక్కన పెట్టింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్) పేరా 12 కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పింఛను అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అర్హులందరికీ కొంత ఉపశమనం కలిగినట్లే. గౌరవప్రదమైన పింఛను లభించేందుకు మార్గం సుగమమైంది. దరఖాస్తులు పరిశీలించిన తరువాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ నుంచి.. పింఛను మంజూరయ్యే సమయం వరకు రావాల్సిన నెలవారీ పింఛను బకాయిల మొత్తంపై ఆదాయపన్ను (టీడీఎస్) మినహాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హతలపై ఈపీఎఫ్వో వివరణ ఇచ్చింది. పింఛను లెక్కింపుపై స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మొదలు పెట్టాయి. డిమాండ్ నోటీసుల మేరకు ఈపీఎస్ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే పింఛను మంజూరు పత్రాలు జారీచేసి, బకాయిలు విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించబోమని.. అవసరమైన పత్రాలన్నీ ఉద్యోగి లేదా యజమాని నుంచి తీసుకుని పరిశీలిస్తామని వెల్లడించింది. ఒకవేళ అర్హత లేకుంటే దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొంది.
ఈపీఎఫ్వో ఏం చెప్పిందంటే..
- ఉదాహరణకు ఒక ఉద్యోగి 2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేశారనుకుందాం. ఆ ఉద్యోగికి పింఛను చెల్లింపు 2014 సెప్టెంబరు 1కి ముందు ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కిస్తారు.
- మరో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు.. 58 ఏళ్ల వయసు నిండకుండానే ఉద్యోగ విరమణ చేశారనుకుందాం. అలాగే మరో కేసులో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 తరువాత 58 ఏళ్లు నిండాక పదవీ విరమణ చేశారనుకుందాం. వీరిద్దరికీ 2014 సెప్టెంబరు 1 తరువాత నుంచి పింఛను ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.. వారి చివరి 60 నెలల సగటు వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్క కడతారు.
- ‘ఎ’ అనే ఒక ఉద్యోగి ఓ సంస్థలో 2015 జనవరి 1 నాటికి 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారనుకుందాం. అప్పుడు ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా కాకుండా.. 58 ఏళ్లుగానే లెక్కిస్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే ఈపీఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లే. దీని ప్రకారం ఆయన ఉద్యోగ విరమణ 2014 సెప్టెంబరు 1 కన్నా ముందుగానే అయినట్లు పరిగణిస్తారు. దీంతో ఈపీఎస్ నుంచి బయటకు వచ్చిన నాటికి చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పింఛను అర్హత వేతనాన్ని ఖరారు చేస్తారు.
- ఉదాహరణకు ‘బి’ అనే ఉద్యోగి ఓ సంస్థలో 50 ఏళ్లకే (2012 జనవరి 1 నాటికి) ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు 58 ఏళ్ల తర్వాత నుంచి.. అంటే 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగ విరమణ చేసిన నాటికి చివరి 60 నెలల సగటు వేతనాన్ని తీసుకుని పింఛను లెక్కిస్తారు.
- ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి 2030లో పదవీ విరమణ చేస్తారనుకుంటే, ఆయన పదవీ విరమణ చేసిన తరువాత పింఛను లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-1995 చట్టంలో అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు పింఛను లెక్కిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!